Janhvi Kapoor : బాలీవుడ్ స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. అతిలోకసుందరి శ్రీదేవి నిర్మాత బోణి కపూర్ ల గారాల కూతురుగా జాన్వీ కపూర్ కి ముందుగానే మంచి క్రేజ్ ఉంది. ఇక ఆ బ్యాక్ గ్రౌండ్ తోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలో టాలీవుడ్ ని ఏలడానికి రెడీ అవుతుందని తెలిసిందే. ఇక్కడ రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీ కానుంది ఈ అమ్మడు. ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ తన తొలి సినిమా హీరోతో మళ్ళీ రొమాన్స్ చేయనుందన్న వార్త బాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ఈ సినిమాని కూడా తనని పరిచయం చేసిన స్టార్ ప్రొడ్యూసర్ మళ్ళీ నిర్మించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
తొలి సినిమా హీరోతో రొమాన్స్ కి రెడీ!
ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ తొలి చిత్రం ‘ధఢక్’ అని తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణంలో ఇషాన్ కట్టర్ – జాన్వీ కపూర్ హీరో, హీరోయిన్లగా ఈ చిత్రం తెరకెక్కింది. జీ స్టూడియోస్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసాడు. 2018 లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో మంచి హిట్ అయింది. ఇక ధఢక్ సినిమా తర్వాత ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ వారి వారి సినిమాలతో బాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పుడు జాన్వీ కపూర్ తన తొలిచిత్ర హీరోతో మళ్ళీ సినిమా చేయబోతుందన్న వార్త బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.
కరణ్ జోహార్ నిర్మాణంలో జాన్వీ సినిమా!
బాలీవుడ్ లో వస్తున్న వార్తల ప్రకారం జాన్వీ కపూర్ ఇషాన్ కట్టర్ మరో సారి జోడి కడుతున్నారన్న వార్తలు వస్తుండగా, ఈ సినిమాని కూడా తమ తొలి సినిమాను నిర్మించిన కరణ్ జోహార్ నిర్మించబోతున్నారట. ఇక బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ గైవాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్టు సమాచారం. కరణ్ జోహార్ దగ్గరుండి కథని వినిపించడంతో హీరో హీరోయిన్లిద్దరూ అప్పుడే ఒకే చేసినట్టు తెలుస్తుంది. ఇక అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని, భోపాల్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉండగా ‘ధడక్’ సినిమా షూటింగ్ టైం లోనే జాన్వీ – ఇషాన్ ప్రేమలో కూడా పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదని తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఇద్దరూ జోడిగా నటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.