Raj Tarun Controversy : యంగ్ హీరో రాజ్ తరుణ్ కాంట్రవర్సీ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో తల దూర్చాడు ఆర్జె శేఖర్. ఏకంగా లావణ్యకి కడుపు రాదంటూ కామెంట్స్ చేయడమే కాకుండా దమ్ముంటే ఆ పని చేయాలంటూ ఛాలెంజ్ విసిరాడు.
లావణ్య కి కడుపు రాదు?
తాజాగా బిగ్ టీవి డిబేట్లో పాల్గొన్న ఆర్జె శేఖర్ లావణ్య పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక అమ్మాయిని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నకు ఆర్జె శేఖర్ స్పందిస్తూ వాడుకున్నాం అనొద్దు, ఆమెకు ఇష్టం లేకుండా ఏది జరగలేదు అని క్లారిటీ ఇచ్చారు. వాడుకోవడం అంటే ఆమె కష్టపడితే, అతను ఒక్కడే సుఖపడ్డాడా అంటూ తిరిగి ప్రశ్నించారు. ఫోన్ లేదా పేపర్ ని వాడుకోగలం కానీ అమ్మాయిని ఎలా వాడుకుంటాం? అంటే అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు అంటూ వివరణ ఇచ్చాడు. అయితే కడుపు వచ్చేది మాత్రం అమ్మాయికే కదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ అసలు లావణ్యకి కడుపే రాదు అంటూ బాంబు పేల్చాడు. ఆమెకు డ్రగ్స్ వాడి పాలోపియన్ ట్యూబ్స్ కరాబ్ అయ్యాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
లావణ్యకు ఆర్జె శేఖర్ ఛాలెంజ్
అయితే లావణ్యకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించడనే మెడికల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా? అనే ప్రశ్నకు ఆర్జె శేఖర్ స్పందిస్తూ అవి సరిగ్గా గమనించండి. అబార్షన్ కాదు ఫాలోపియన్ ట్యూబ్స్ తీసేసిన మెడికల్ రికార్డ్స్. ఒకవేళ ఆమెకు బలవంతంగా చేయించి ఉంటే ఎఫ్ఐఆర్ లో 314 సెక్షన్ ను ఎందుకు మెన్షన్ చేయలేదు? నిజంగానే ఆమెకు కడుపు వచ్చేటట్టు అయితే దమ్ముంటే ఒబోర్తీన్ టెస్ట్ చేయించాలంటూ చాలెంజ్ విసిరారు. అంతేకాదు ఆమె మీడియా ముందు అన్నీ ఉత్తుత్తి మాటలే చెబుతోంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో లావణ్య పై సానుభూతి చూపిస్తున్న చాలామంది ఆర్జె శేఖర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆమెకు కడుపు వస్తుందో లేదో ఇతని ఎలా చెప్తాడు? అనీలు ఇద్దరూ కలిసి కాపురం చేసినప్పుడు అంటూ మండిపడుతున్నారు. ఎంత రాజ్ తరుణ్ బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం ఇలా మాట్లాడతాడా ? అంటూ ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా లావణ్య హీరో రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్లు రిలేషన్ లో ఉన్నాడని, సీక్రెట్ గా తనను పెళ్లి కూడా చేసుకున్నాడని షాపింగ్ ఆరోపణలు చేసింది. అయితే మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో ఎఫైర్ మైంటైన్ చేస్తూ తనను దూరం పెడుతున్నాడని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. అంతేకాకుండా రాజు తరుణ్ తనకు అబార్షన్ చేయించాడంటూ బాంబు పేల్చింది. మొత్తానికి పలు నాటకీయ పరిణామాల మధ్య రాజ్ తరుణ్ పై కేసు నమోదు అయ్యింది. జూలై 16న విచారణకు హాజరు కావలసి ఉండగా రాజ్ తరుణ్ డుమ్మా కొట్టాడు. మరోవైపు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన రొమాంటిక్ చాట్ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇన్ని గొడవల మధ్య రాజ్ తరుణ్ తిరగబడరా సామి అనే మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.