Samantha Next Movie : తెలుగు చిత్ర పరిశ్రమలో సమంతకు టాప్ హీరోల సరసన నటించే అవకాశం రావట్లేదు. కనీసం హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా రావట్లేదు. అందుకే ఆమె ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే అక్కడ ఓ వెబ్ సిరీస్ కు కమిట్ అయిన సామ్ తాజాగా ఓ సంచలన దర్శకుడు రూపొందిస్తున్న మరో హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
తుంబాద్ డైరెక్టర్స్ తో నెక్స్ట్ ప్రాజెక్టు
ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమతో పాటు ఓటీటీ ప్రపంచంలో కూడా అవకాశాల కోసం వెతుకుతున్న సమంతకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో తన పేరు మార్మోగిపోయేలా చేసిన సామ్ ఆ తరువాత ‘ఊ అంటావా’లో అనే పాటతో టాప్ లేపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిర్మిస్తూ నటిస్తోన్న ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు మరిన్ని స్క్రిప్ట్లు వింటోంది. తాజా అప్డేట్ ప్రకారం తనకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి పేరు తెచ్చిపెట్టిన రాజ్ & డీకే కాంబోతో మరోసారి పని చేయబోతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ ఇతర బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ఈ ప్రముఖ దర్శక ద్వయం తాజాగా హారర్ వెబ్ సిరీస్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే వారు దర్శకత్వం వహించకుండా కేవలం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ సిరీస్ కు తుంబాద్ ఫేమ్ రాహి అనిల్ దర్శకత్వం వహించనున్నారు.
టైటిల్ ఛేంజ్
నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ ను ప్రసారం చేయబోతోంది. 2024లఓ సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2025లో విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. ఆసక్తికరమైన నేపథ్యంతో భారీ బడ్జెట్తో దీన్ని రూపొందించనున్నారు. స్క్రిప్ట్ చాలా ట్విస్ట్లతో థ్రిల్లింగ్గా ఉంటుందని అంటున్నారు. ఇందులో సమంతతో పాటు వాకీమా గబ్బి, హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ లు భాగం కానున్నారు. త్వరలోనే ఈ సిరీస్ గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుంది. కాగా ఈ సిరీస్ కు పేరు మార్చారు. ముందుగా ఈ సిరీస్కి రక్తబీజ్ అని పేరు పెట్టారు. తాజాగా దానిని ‘రక్త్ బ్రహ్మాండ్’ అని మార్చినట్టు సమాచారం. అయితే తుంబాద్ కంటే ఈ మూవీని చేయాలనుకున్నారట. అలాగే దీన్ని సినిమాగా చేద్దామని అనుకున్నప్పటికీ స్టోరీ నిడివి భారీగా ఉండడంతో వెబ్ సిరీస్ అయితే బెటర్ అని అనుకున్నారట.
బెడిసికొట్టిన జానర్ లోనే
సమంత హారర్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు రాజు గారి గది సినిమాలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఆ మూవీ ఆడలేదు. మరోసారి ఈ వెబ్ సిరీస్ కోసం అదే జానర్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది సామ్. కాగా ప్రస్తుతం సామ్ వరుణ్ ధావన్తో కలిసి ‘సిటాడెల్’ అనే సిరీస్ ను చేస్తోంది. రాజ్ & డీకే దీన్ని రూపొందించారు. సామ్ ఈ ఇద్దరు దర్శకులతో ముచ్చటగా మూడోసారి వర్క్ చేయబోతోంది.