Pallavi Prashanth: రైతు బిడ్డ పేరుతో బిగ్ బాస్ సీజన్ 7 లోకి కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టి.. తనదైన ఆటతీరుతో ఏకంగా టైటిల్ ని కైవసం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ట్రోఫీ అందుకునే సమయంలో తనకు వచ్చిన డబ్బులు మొత్తం అన్నదాతల కోసం ఖర్చు చేస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని అటు నెటిజెన్లు ఇప్పటికే ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే. రైతు బిడ్డ ఇచ్చిన మాటను గట్టుమీద పెట్టేసాడని, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, టీవీ షో లతో అతను తీరిక లేకుండా బిజీగా మారిపోయాడని ట్రోల్స్ చేస్తూ భారీ స్థాయిలో కామెంట్ చేస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ఒక యూట్యూబర్ కూడా రైతుబిడ్డను ఏకీపారేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పల్లవి ప్రశాంత్ పై యూట్యూబర్ షాకింగ్ కామెంట్స్..
ప్రముఖ యూట్యూబర్ యువ సామ్రాట్ రవి మాట్లాడుతూ.. నాకు కూడా బిగ్ బాస్ షో కి వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. కానీ లాస్ట్ సీజన్ చూసిన తర్వాత ఇక బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఆసక్తి కూడా పోయింది. ఎందుకంటే సీజన్ సెవెన్ లో ఒక పెద్ద డ్రామా నడిచింది.. రైతు బిడ్డ పేరుతో హౌస్ లోకి వెళ్ళిన ప్రశాంత్ సింపతి డ్రామా ఒక రేంజ్ లో ఆడాడు.. నేను రైతు బిడ్డను అమ్మ.. విజేతగా నిలిస్తే పేద రైతులకే మొత్తం పైసలు ఇస్తాను అంటూ ఆడియన్స్ ను నమ్మబలికి విన్నర్గా నిలిచాడు.. అయితే ఇప్పుడు రైతుల కోసం ఖర్చు చేయకుండా ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు కారు కూడా కొన్నాడు..
సింపతీ తోనే టైటిల్ విన్నర్..
అయితే రైతుబిడ్డ కారు కొనకూడదా అంటే కొనొచ్చు కానీ రైతులకు ఇస్తానన్న డబ్బు ఇవ్వాలి కదా.. అడిగితేనేమో నన్ను సీఎంను చేయండి ఇస్తానని అంటున్నాడు.చక్కగా కారు కొనుక్కొని అమ్మలందరికీ మో చేయి చూపించాడు. ఈ రైతు బిడ్డ కన్నింగ్ డ్రామాలు చూసిన తర్వాత ఇక హౌస్ లోకి వెళ్లాలన్న ఆలోచనను నేను విరమించుకున్నాను అంటూ యువ సామ్రాట్ రవి పల్లవి ప్రశాంత్ పై విమర్శలు గుప్పిస్తూ సంచలన కామెంట్లు చేశారు . ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
పైగా శివాజీ సపోర్ట్ కూడా..
ఇకపోతే ఈ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ పేరుతో హౌస్ లోకి అడుగుపెట్టారు. అక్కడ ఇతడికి సీనియర్ స్టార్ హీరో శివాజీ సపోర్టు చేయడంతో ఇతడికి బాగా కలిసి వచ్చింది. పైగా రైతుల కోసం సహాయం చేస్తానని రైతులే దేవుళ్ళు, నేను రైతు బిడ్డని, నన్ను గుర్తించండి అంటూ ఆడియన్స్ లో సింపతి దక్కించుకున్నాడు. ఇక అనుకున్నట్టుగానే తన పన్నాగం పండింది. టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే నాడు ఇచ్చిన మాటను తప్పి నేడు మరొకసారి విమర్శల పాలవుతున్నారు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చేస్తున్న పనులపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయాలపై పల్లవి ప్రశాంత్ స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.