Shahrukh Khan.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరో మాత్రమే కాదు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అంతే కాదు రూ.3000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి, అత్యంత రిచ్ హీరోగా రికార్డు సృష్టించారు షారుఖ్ ఖాన్. అందుకే సినీ ఇండస్ట్రీలో ఏ విషయమైనా సరే ఈయనకు అనుకూలంగా ఉండాల్సిందే. ఈయనను కాదని ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం వారి కెరియర్ ఉండదు అని పలువురు నెటిజెన్లు కూడా అప్పుడప్పుడు కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయనతో పెట్టుకున్న ఒక టాలీవుడ్ హీరో ఏకంగా కెరియర్ ను నాశనం చేసుకోవడం ఇక్కడ ఆశ్చర్యకరం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సింగర్ నితిన్ ముఖేష్ కుమారుడే నీల్..
ప్రముఖ బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈయన ఎవరో కాదు ప్రముఖ గాయకుడు నితిన్ ముఖేష్ కుమారుడు, ముఖేష్ మనవడు కూడా.. నీల్ నితిన్ ముఖేష్ 1988లో విజయ్ అనే సినిమా ద్వారా బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి , 2007లో వచ్చిన జానీ గద్దర్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈయనే ఒకానొక సమయంలో ఒక ఫంక్షన్ లో జరిగిన సంఘటన కారణంగా ఏకంగా తన కెరీయర్ నే నాశనం చేసుకున్నారు.
షారుక్ ఖాన్ వల్లే కెరియర్ నాశనం..
అసలు విషయానికి వెళ్తే.. అదృష్టం ఈయనకు కలిసి రాకపోయినా హీరోగా నిలదెక్కుకోవాలనే ప్రయత్నంలో కూడా విఫలం అయ్యారనే చెప్పాలి. ఈయన తండ్రి పెద్ద గాయకుడు.. ఈయనను స్టార్ హీరోగా చేయాలని ఆయన ఎంతో తపించాడు ముఖ్యంగా నీల్ నితిన్ ముఖేష్ కెరియర్ కోసం ఎన్నో కష్టాలు కూడా పడ్డారు.. కానీ ఆయన కెరియర్ పతనం అవ్వడానికి షారుక్ ఖాన్ ప్రధాన కారణం అని అప్పట్లో బాలీవుడ్లో వార్తలు కోడై కూశాయి. ఒక ఈవెంట్లో షారుక్ ఖాన్ , నీల్ ను ఒక ప్రశ్న అడిగాడు. అయితే నీల్.. షారుఖ్ ఖాన్ అందరి ముందే నోరు మూసుకో అని చెప్పాడట.. ఇక అంతే అవమాన భారంగా ఫీలైన షారుక్ ఖాన్ దర్శక నిర్మాతల చేత ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు రానివ్వకుండా అడ్డుకున్నారని, ముఖ్యంగా ఈయన సినిమా కెరియర్ పతనం అవ్వడానికి షారుఖ్ ఖాన్ ప్రధాన కారకుడని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు.. మరి ఇందులో నిజానిజాలు తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి.
నీల్ నితిన్ ముఖేష్ సినిమాలు..
నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా పేరు దక్కించుకున్న నీల్ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినా తెలుగులో మాత్రం 2018లో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ , మెహరీన్ తదితరులు నటించిన చిత్రం కవచం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నీల్ నితిన్ ముఖేష్. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహోలో కూడా నటించాడు. ఇక ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోవడం లేదు.