Raj Tarun : రాముడి లాంటి ‘పురుషోత్తముడు’ మీడియా ముందుకు వచ్చే టైం వచ్చేసింది

Raj Tarun.. ప్రముఖ హీరో రాజ్ తరుణ్ గురించి అసలు నిజం బయటపడే వరకు అందరూ పురుషోత్తముడే అనుకున్నారు. కానీ ఆయన గురించి అసలు విషయం తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు.. రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగబోతుంది. లావణ్య కేసు పెట్టిన తర్వాత, రాజ్ తరుణ్ ఎక్కువ సార్లు మీడియా ముందుకు వచ్చాడు. ఆమె దగ్గర సాక్ష్యాలు లేవు అని, తన పరువు తీస్తుంది అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆమె పైనే కేసు పెట్టాడు కూడా..

Raj Tarun: The time has come for a 'purushottama' like Ram to come before the media
Raj Tarun: The time has come for a ‘purushottama’ like Ram to come before the media

దీంతో స్పందించిన పోలీసులు ఆధారాలు సమర్పించాలని, ఆమెకు నోటీసులు కూడా పంపించారు. అంతలోపే ఆమె పరార్ అయ్యిందని, ఆమె రాజ్ తరుణ్ పై తప్పుడు ఆరోపణలు చేసిందని మీడియా కోడై కూసింది.. దీనికి తోడు కొన్ని రోజులు సైలెంట్ అయిపోయిన లావణ్య, ఒక్కసారిగా సాక్ష్యాలను చేతబట్టుకొని..అన్ని పేపర్స్ తో సహా, ఆడియో కాల్స్, చాట్ హిస్టరీ తో వచ్చి, మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. అప్పుడు తెలిసింది ఇతగాడి బాగోతం.

లావణ్య గురించి స్పందిస్తాడా..?

మోసపోయిన లావణ్య అన్ని ఆధారాలను సమర్పించడంతో నోరు మెదపలేదు రాజ్ తరుణ్. పైగా లావణ్య కళ్యాణ్ దిలీప్ సుంకరను లాయర్ గా పెట్టుకుంది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ బయటికి రాలేదు. కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు. రీసెంట్ గా రాజ్ తరుణ్ ఫ్రెండ్… ఆర్.జే శేఖర్ బాషా బయటికి వచ్చి లావణ్య గురించి మాట్లాడుతున్నాడు. కానీ, రాజ్ తరుణ్ ఏం మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలోనే మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నాడా లేక తన దగ్గర ఇంకా ఏదైనా ఆధారాలు ఉన్నాయా అన్నది తెలియదు.. కానీ ప్రస్తుతం పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా, వస్తాడా..? ఒకవేళ వస్తే లావణ్య ఇష్యూ గురించి ఏదైనా స్పందిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇకపోతే మీడియా ముందుకు వచ్చాడంటే కచ్చితంగా రిపోర్టర్స్ ఈ విషయంపై ప్రశ్నిస్తారు.. ఇక ఈ విషయాన్ని రాజు తరుణ్ దాట వేసే ప్రయత్నాన్ని చేయలేరు. ఒకవేళ అలా చేస్తే ఆరోపణలు నిజమవుతాయని భయం కూడా ఆయనలో ఉంటుంది. ఇలాంటి భయాలన్నీ కూడా చుట్టుముట్టిన నేపథ్యంలో రాజ్ తరుణ్ ఈ తెరలను తొలగిస్తాడా లేక తప్పించుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

పురుషోత్తముడు సినిమా..

రాజ్ తరుణ్ , హాసిని సుధీర్ జంటగా వస్తున్న చిత్రం పురుషోత్తముడు శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో పురుషోత్తముడు సినిమాను నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , మురళీ శర్మ, ముఖేష్ కన్నా, బ్రహ్మానందం లాంటి భారీ తారాగణంతో జులై 26వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ కూడా చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ నేపథ్యంలోనే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మరి ఈవెంట్ కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖచ్చితంగా రాజ్ తరుణ్ రావాల్సి ఉంటుంది.. వస్తే లావణ్య గురించి స్పందిస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు