Buddy: సందీప్ వదిలేసిన కథను , శిరీష్ పట్టుకున్నాడా.?

Buddy: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ లో అల్లు శిరీష్ ఒకరు. అయితే గౌరవం ఉన్న సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్లు తీసుకురాకపోయినా కూడా ఒక మంచి సినిమాను చేశాడు అని ఒక గౌరవం అయితే మాత్రం తీసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు అల్లు శిరీష్ కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒకటి కూడా లేదు. కొన్ని సినిమాలు ఉన్నా కూడా అవి అంతంత మాత్రమే ఆడాయి. పరశురాం మారుతి వంటి దర్శకుల దర్శకత్వంలో కూడా సినిమాలు చేశాడు శిరీష్.

నీకు రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత శిరీష్ చేస్తున్న సినిమా బడ్డీ. అల్లు శిరీష్ జంటగా గాయత్రి భరద్వాజ్ నటిస్తుంది. ఈ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా జూలై 26, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అని ముందుగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఎక్కువ రోజులు టైం కూడా లేదు కానీ ఈ సినిమా గురించి మినిమం ప్రమోషన్స్ కూడా చేయట్లేదు చిత్ర యూనిట్.

Sundeep Kishan

- Advertisement -

ఇకపోతే మొదట ఈ సినిమాని సందీప్ కిషన్ హీరోగా తీద్దామని అనుకున్నారట. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కి సంబంధించి దర్శకుడు తో కొద్దిపాటి విభేదాలు వచ్చినట్లు సమాచారం వినిపిస్తుంది. మొత్తం ఒక డాల్ చుట్టూ ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశాడంట దర్శకుడు. అయితే సందీప్ కాస్త సందీప్ కి నచ్చక ఈ సినిమాను వదులుకున్నాడు అని తెలుస్తుంది. సందీప్ హీరోగా ఒక పోస్టర్ కూడా అప్పట్లో చక్కెరలు కొట్టింది. ఇక సడన్ సేమ్ పోస్టర్ తో హీరో మారుతూ కొన్ని రోజుల తర్వాత మరో పోస్టర్ రిలీజ్ అయింది. అలా సందీప్ వదిలేసిన సినిమాను శిరీష్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో కొన్నిచోట్ల పోస్ట్లు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు