Allu Sireesh: మనోళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయకుండా సెట్స్ కి వెళ్తారు, అయ్యో అలా అనేసాడు ఏంటి.?

Allu Sireesh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మెగా హీరోస్ లో అల్లు శిరీష్ ఒకరు. గౌరవం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అయితే ఆ సినిమా ఊహించిన విజయం సాధించలేక పోయినా కూడా ఒక హీరోగా మంచి గౌరవాన్ని అయితే తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత అల్లు శిరీష్ ఎన్ని సినిమాలు చేసినా కూడా మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్తజంట. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాలు శిరీష్ కెరియర్ లో మంచి సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇక అల్లు శిరీష్ చివరగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అను ఇమ్మానుయేల్ శిరీష్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించుకుంది. మంచి రేటింగ్స్ సాధిస్తూ ఒక డీసెంట్ హీట్ గా ఈ సినిమా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఫిరీస్ చేస్తున్న సినిమా బడ్డీ. ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ చిత్ర యూనిట్ పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది. వాస్తవానికి ఈ సినిమాని 26వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Sirish

- Advertisement -

ఇకపోతే అల్లు శిరీష్ రీసెంట్ గా ఈ సినిమా గురించి బడ్డీ చిత్ర యూనిట్ తో పాటు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శిరీష్. ఈ సినిమా దర్శకుడిని ప్రశ్నించే తరుణంలో చాలామంది మనవాళ్లు, అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులు ప్రీ ప్రొడక్షన్ లేకుండా సినిమా సెట్స్ కి వెళ్తారని, అందువల్లనే ఎక్కడో అనుకున్న బడ్జెట్ కాస్త అది దాటి హెవీ బడ్జెట్ అయిపోతుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే కేవలం తెలుగు దర్శకులతో మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులతో కూడా అల్లు శిరీష్ పనిచేశాడు. తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు