Poonam Kaur..ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అంద చందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈమె నటించింది కేవలం కొన్ని చిత్రాలు అయినా ఆ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. ప్రస్తుతం సినిమాలలో నటించకపోయిన సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఎక్కువగా పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ ఈమె చేసే కామెంట్లు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడు ఎవరిని ఎలా సపోర్ట్ చేస్తుందో..? ఎప్పుడు ఎలా ఎవరిని విమర్శిస్తుందో కూడా తెలియని పరిస్థితిలో అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయని చెప్పవచ్చు.
పూనమ్ గురించి తప్పుడు పోస్ట్..
ఇదిలా ఉండగా తాజాగా ఒక వార్తాపత్రిక పై సంచలన ట్వీట్ వేసింది పూనమ్ కౌర్. అయితే ఈ ట్వీట్ కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దిశా ఘటన సమయంలో పూనమ్ ట్వీట్ చేసినట్లు ఒక వార్తను ఆంధ్ర *తి వెబ్ సైట్ ప్రచురించింది.. “దిశాకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి , అలాగే తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు.. ఈ విధంగానే నాతోపాటు పలువురు మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ, రాజకీయ నాయకులకు శిక్ష విధిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ..ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు ” అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ వేసినట్టు ఆంధ్రజ్యోతి ప్రచురించింది.
ఇలాంటి పత్రికను నమ్మవద్దు అంటున్న పూనమ్..
అయితే ఈ విషయంపై స్పందించిన పూనమ్ కౌర్ ఈ పోస్ట్ చేసింది..ఆ ట్వీట్ వేసింది నేను కాదు అంటూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..” నాపై మరో ఫేక్ న్యూస్ వచ్చింది. దీనిపై ఆంధ్రజ్యోతి నాకు ఇప్పటి వరకు కూడా క్షమాపణలు తెలియజేయలేదు..కనీసం క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు.. ఒకరి అభిప్రాయాలను మరొకరి పైన రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారేమో.. అందుకే నేను వీళ్లు స్పందిస్తారని అనుకోవట్లేదు. ఇలాంటి వాళ్లను నమ్మవద్దు అంటూ ప్రజలకు నేను గుర్తు చేస్తున్నాను.. ఇలాంటి వాళ్లు ఇప్పటికీ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నారు” అంటూ పూనమ్ కౌర్ రాసుకుంది.. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది.. ప్రత్యేకించి ఒక బడా వార్తాపత్రికను నమ్మవద్దు అంటూ చేసిన ట్వీట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు.
పూనమ్ కౌర్ సినీ ప్రస్థానం..
పూనమ్ కౌర్ సినీ ప్రస్థానం విషయానికొస్తే.. 2005లో మిస్ ఆంధ్ర టైటిల్ గెలుచుకున్న ఈమె ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో , నటనతో యువతను ఆకట్టుకొని వరుస చిత్రాలలో అవకాశాలు అందుకుంది.. అలా ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్ పంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత శౌర్యం సినిమాలో దివ్య క్యారెక్టర్ లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ, వినాయకుడు, గణేష్ ,నాగవల్లి, ఆడు మగాడ్రా బుజ్జి, ఎటాక్, నాయకి వంటి తెలుగు చిత్రాలలో నటించింది. అంతేకాదు తమిళ్ , కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
Another set of fake news on me , there is no apology or clarification given by the media house on this till now , may be it’s ok to rub one’s agendas through some else shoulder .
I have no hopes but I am reminding and requesting people not to believe but they haunt me till now. pic.twitter.com/fE22DZ9VHF
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 23, 2024