Bellamkonda Sai Srinivas: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి మెగా దర్శకుడు బాబీ కథను అందించాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉంటుంది. అలానే తన సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో అయినా కూడా తమకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకోవడం వేరు. వాళ్ల ప్రేమను సాధించుకోవడం వేరు. మంచి సినిమాలు చేయటం వల్ల అభిమానులు వస్తారు ఆఫ్ స్క్రీన్ లో మంచితనాన్ని చూపించడం వలన ఆ మనిషిని ప్రేమించడం మొదలుపెడతారు. అంత పెద్ద నిర్మాత కొడుకు అయినా కూడా ఏమాత్రం గర్వం ఈర్ష స్వార్థం లేకుండా ఉంటాడు సాయి శ్రీనివాస్. అందరితో నవ్వుతూ మాట్లాడుతాడు. ఇప్పటివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద ఒక కాంట్రవర్సీ కూడా లేదు. అలానే తనని ట్రోల్ చేసినా కూడా పెద్దగా స్పందించడు.
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు విజయ్ కనకమెడల దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దాదాపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. ఈ సందర్భంగా తన ప్రత్యేకమైన రోజుని ఒక అంధుల పాఠశాలలో జరుపుకున్నాడు. చాలామందికి భోజనం వడ్డిస్తూ అక్కడ బట్టలను కూడా పంచాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన కొంతమంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ప్రశంసిస్తున్నారు.
As I mark 10 unforgettable years in the film industry, I’m overwhelmed with gratitude for all the amazing fans and audiences who have stood by me through thick and thin. Your unwavering support has been my greatest strength.
To honor this milestone, I’m dedicating this special… pic.twitter.com/BxPyvAWpoW
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) July 25, 2024