Anasuya.. జబర్దస్త్ కామెడీ షో లో హాట్ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గ్లామర్ బ్యూటీగా మరింత క్రేజ్ అందుకున్న ఈ అమ్మడు తన హాట్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఒకవైపు బుల్లితెర షో లు ,మరొకవైపు సినిమాలు అంటూ బిజీ గా గడిపేస్తున్న అనసూయ కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో వాలిపోతుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనసూయ..
ఇదిలా ఉండగా తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబా. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న అనసూయ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు తెలిపారు. అందులో భాగంగానే రిపోర్టర్ అనసూయని ప్రశ్నిస్తూ ఇటీవల కాలంలో మీరు ఎక్కువగా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని విన్నాము అసలు కారణం ఏంటి అని ప్రశ్నించారు. దీనికి అనసూయ మాట్లాడుతూ నేను ఒక పాత్రలో ఒక సినిమాలో చేసి ఆ సినిమా సక్సెస్ అయితే అదే తరహా పాత్రలో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే రిజెక్ట్ చేస్తున్నాను ఉదాహరణకు క్షణం సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను.. సినిమా హిట్ అయింది.. ఆ తర్వాత కూడా అదే తరహా పాత్రలొస్తుంటే రిజెక్ట్ చేశాను.. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర సక్సెస్ అయ్యింది. తదుపరి కూడా అలాంటి పాత్రలే వచ్చాయి అందుకే రిజెక్ట్ చేశాను.
గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత..
అందుకే ఇకపై ఇలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను.. ఇలా సినిమాలను రిజెక్ట్ చేయడానికి కూడా కారణం లేకపోలేదు. నేను గ్లామర్ ని ఎక్కువగా ప్రదర్శించాలని అనుకుంటున్నాను.. అందులో తప్పులేదు కదా.. నేను గ్లామర్ మెయింటైన్ చేసినన్ని రోజులు కూడా అలాంటి పాత్రలు చేస్తాను.. ఈ విషయంలో ఏ మాత్రం మొహమాటం లేదు.. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఖచ్చితంగా నేను డిమాండ్ చేసి తీరుతాను అంటూ నిర్మొహమాటంగా మీడియా ముఖంగా చెప్పేసింది అనసూయ.. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విజయ్ దేవరకొండ విషయంపై స్పందన..
ఇక ఇటీవల విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఈమె చేసిన కామెంట్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ తో వివాదాన్ని ఏకంగా సినిమాలోనే పెట్టేశారు చిత్ర బృందం .విజయ్ దేవరకొండ అభిమానులకు తనకు మధ్య ఉన్న వివాదంపై కూడా క్లారిటీ ఇచ్చింది. సామాజిక స్పృహతో సినిమాలలో నటించాలని , సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అలాంటి పాత్రలు చేస్తున్నారంటూ కూడా గట్టిగా అడిగింది. అంతేకాదు ఇవన్నీ తాను అడిగాను కాబట్టే తనను తప్పుపడుతున్నారని , అసలు మీడియా ఎందుకు ప్రశ్నించలేదు అంటూ మీడియా పై కూడా మండిపడింది అనసూయ. ఇక ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.