Prabhas Marriage.. పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఈయన సినిమాల ద్వారానే కాదు ఇతరులకు సహాయం చేయడంలో కూడా రారాజు అనిపించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అన్నీ కూడా వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ భారీ ఇమేజ్ దక్కించుకున్నారు. గత ఏడాది సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898AD చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.. కానీ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. కనీసం ఇప్పుడైనా వివాహం చేసుకుంటారని అభిమానులు ఆరాటపడుతున్నారు.. కానీ పెళ్లిపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి కానీ వాటిని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్.
ప్రభాస్ పెళ్లి ఫిక్స్.. శ్యామలాదేవి కామెంట్స్..
అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.. ప్రభాస్ పెళ్లి బట్టలు ఇక్కడే కొంటాము అంటూ చెప్పిన కామెంట్లు విని .. చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ప్రభాస్ పెళ్లి ఫిక్స్ చేశారు..? అమ్మాయి బాగుందా..?ఆమె ఎవరు..? అన్ని ఫిక్స్ చేసి ఒకేసారి డేట్ వెల్లడిస్తారా..? అందుకే శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి బట్టల గురించి ఆలోచిస్తుంది అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్యామలాదేవి..
అసలు విషయంలోకెళితే వినాయకుడు, హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన కృష్ణుడు, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నటుడు కృష్ణుడు భార్య గాయత్రి ఇంకొకరితో కలిసి శారీ బిజినెస్ మొదలుపెట్టింది. అభిలాష రెడ్డి , గాయత్రి కలిసి జరీవరం అనే ఒక శారీ షాప్ ను ఓపెన్ చేసారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈ షాప్ ని తాజాగా ప్రారంభించడం జరిగింది. ఈ షాపు ఓపెనింగ్ కి హీరో రక్షిత్ అట్లూరి, హైదరాబాదు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అతిధులుగా విచ్చేశారు.
ప్రభాస్ పెళ్లి బట్టలు ఇక్కడే కొంటాం..
అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామలాదేవి జరీ వరం స్టోర్ కి నన్ను అతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉంది. నాకు పర్సనల్గా కంచి పట్టుచీరలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆ కలెక్షన్లు బాగున్నాయి. కృష్ణంరాజు గారు నాకు కొన్న ఫస్ట్ చీర కూడా కంచి పట్టుచీర అని, ప్రభాస్ పెళ్లి బట్టలు కూడా ఈ జరీవరం నుండే కొంటాను అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికైతే ప్రభాస్ పెళ్లి పనులు మొదలవగానే, కచ్చితంగా పెళ్లి బట్టలు ఇక్కడే కొంటామని క్లారిటీ ఇచ్చింది. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఓ ఇదా అసలు సంగతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్యామలాదేవి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.