Renu Desai: మళ్లీ కలవనున్న రేణూ దేశాయ్ – పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఖుషీ..!

Renu Desai.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణూ దేశాయ్ తన మాజీ భర్త , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవబోతోంది అంటూ వార్త రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ దూరమైనప్పటికీ కూడా వీరిద్దరూ మళ్ళీ కలిసి జీవించాలని ఎంతోమంది అభిమానులు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు కానీ రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నట్లు తన మాటల ద్వారా స్పష్టమవుతూ ఉంటుంది..

Renudesai: Renu Desai - Pawan Kalyan will meet again.. Fans Khushi..!
Renu Desai: Renu Desai – Pawan Kalyan will meet again.. Fans Khushi..!

పవన్ కళ్యాణ్ ను కలవనున్న రేణూ దేశాయ్..

ఇకపోతే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాడు.. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లల బాధ్యతను చూసుకుంటూ కెరియర్ ముందుకు సాగిస్తోంది.. ఇక వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా సరే ఈ జంట ఎప్పుడూ అభిమానులకు ఫేవరెట్ అని చెప్పాలి. పర్సనల్ కారణాల వల్ల విడిపోయిన వీరు మళ్ళీ కలిస్తే బాగుంటుంది అని అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మళ్ళీ కలవబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్..

మరి అసలు విషయంలోకెళితే ప్రముఖ నటి రేణూ దేశాయ్, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కి చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శుక్రవారం జూబ్లీహిల్స్ లోని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖను వారి ఇంట్లో చాలా ఫార్మల్గా కలిసింది రేణు దేశాయ్.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నెలకొల్పుతున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను ఆమె మంత్రి సురేఖతో వివరించారు. రేణు దేశాయ్ ని మంత్రి సురేఖ పట్టుబట్టలు , బంగారు గొలుసు పెట్టి సత్కరించారు. ఈ క్రమంలోనే వచ్చేవారం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్ , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత ఆనం నారాయణ రెడ్డిని ఆమె కలిసే అవకాశం ఉన్నట్లు, అందులో భాగంగానే భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ గురించి ఆంధ్రలో ఉన్న పెద్ద వాళ్లతో మాట్లాడబోతున్నాము అంటూ రేణు దేశాయ్ తెలిపింది అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి మాట్లాడే అవకాశాలున్నాయట .

- Advertisement -

అందుకోసమే కలయిక..

ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికతను కూడా పిల్లలు అలవర్చుకోవాలనేది రేణు దేశాయ్, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ యొక్క అభిప్రాయం.. అందుకే ఈ మేరకు అన్ని రాష్ట్రాల పెద్దలతో మాట్లాడి ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను రేణూ దేశాయ్ అఫీషియల్ గా కలుస్తున్నారని సమాచారం.. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. అంతే కాదు నిజంగానే వీరిద్దరూ వైవాహిక బంధం లో కూడా మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు