Charmy Kaur : వాళ్ళిద్దర్నీ అన్ ఫాలో చేసిన చార్మి… సోషల్ మీడియాలో ప్రకంపనలు

Charmy Kaur : చార్మి అంటే తెలియని వాళ్ళు లేరు అని చెప్పొచ్చు ఒకప్పుడు తెలుగు తమిళ్ హిందీ మలయాళం సినిమాల్లో చాలా సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వం వహించిన నీ తోడు కావలి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది చార్మి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత నీకే మనసిచ్చాను సినిమాతో మరోసారి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాలో మళ్లీ కనిపించింది. అయితే ఈ సినిమా కూడా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. మొత్తానికి గౌరీ సినిమాతో ఛార్మి కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇంక ఛార్మి కెరియర్లో మంచి హిట్ ఫిలిమ్స్ అంటే అనుకోకుండా ఒక రోజు,లక్ష్మి, పౌర్ణమి, రాఖీ , మాస్ సినిమాలు. అయితే వరుసగా హీరోయిన్ గా రాణిస్తున్న తరుణంలో చార్మి ప్రొడ్యూసర్ గా కూడా తన కెరియర్ స్టార్ట్ చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో కో ప్రొడ్యూసర్ గా తన జర్నీ మొదలుపెట్టింది అక్కడితో సినిమాలకు నటించడంలో బ్రేక్ ఇచ్చింది చార్మి. అయితే చార్మి నిర్మించిన సినిమాలు అన్నీ కూడా ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలాయి.

Puri Jagannath, Charmi

- Advertisement -

ప్రస్తుతం ఛార్మి నిర్మాతగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తుంది. ఛార్మి ఆయా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. కేవలం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే సినిమాలకు మాత్రమే నిర్మాతగా వ్యవహరిస్తుంది చార్మి. ఇకపోతే పూరి జగన్నాథ్ కి రవితేజ తోను, హరీష్ శంకర్ తోని ఎంత మంచి బాండింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హరీష్ శంకర్ మరియు రవితేజను అన్ని రకాల సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసేసింది ఛార్మి. వీరి కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా వస్తుంది. అలానే పూరి ప్రొడక్షన్ హౌస్ నుంచి డబల్ ఇస్మార్ట్ సినిమా వస్తుంది ఈ సినిమాల విషయంలో జరిగిన వివాదాలు వలన వీరిద్దరినీ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది అని సమాచారం వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు