Filim Chamber : టాలీవుడ్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. రాజు పదవీకాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి ఠాగూర్ మధు, భరత్ భూషణ్ పోటీ చేశారు. ఈ పోటీలో ఏకగ్రీవంగా భరత్ భూషణ్ ఎన్నికైనట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ మొదలైనట్లు తెలిసిందే..
ఈ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.. ఈ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ , స్టూడియో సెక్టార్ లోని సభ్యులు ఆసక్తి కనబరిచారు.. 25 ఓట్ల మెజారిటీ తో భరత్ భూషణ్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుఎన్నుకున్నారు.. ఇక ఈ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. 25 ఓట్ల మెజార్టీ ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా ఎన్నికవుతారని ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే…
ఈ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రెండేళ్లకోసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగుతున్నాయి.. గతంలో దిల్ రాజు అధ్యక్షులుగా ఉన్నారు.. ఇక కొత్తగా ఎన్నికైన భరత్ భూషణ్ కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఇక తాజాగా ఉపాధ్యక్షుడి ఎన్నికల ఫలితాలు కూడా ఇప్పుడే విలువడ్డాయి.. ఈ పదవికి పోటి పడిన వారిలో 29 ఓట్ల మెజారిటీ తో అశోక్ కుమార్ గెలిచారు.. ఆ తర్వాత 17 ఓట్లతో వైవిఎస్ చౌదరి వెనుకంజ వేశారు..