Gayathri Gupta.. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ గాయత్రి గుప్తా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ముఖ్యంగా కొబ్బరిమట్ట, ఫిదా , ఐస్క్రీమ్ 2 మిఠాయి వంటి చిత్రాలలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. కొత్త సినిమాలే కాదు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.పెళ్ళికి ముందు, సీత ఆన్ ద రోడ్ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో బాగా క్రేజ్ దక్కించుకున్న ఈమె, ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ తో పాటు క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్లు చేసి ఇండస్ట్రీని షేక్ చేసిందిm అప్పటినుంచి అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు రాలేదు. దాంతో అడపా దడపా సినిమాల్లో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో వాటిని వదులుకోకుండా ఉపయోగించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
అమ్మాయిలకు శృంగార కోరికలు ఎక్కువ..
అందులో భాగంగానే అన్ స్టాపబుల్, ఫ్లాట్, డబుల్ ఇంజన్ వంటి వెబ్ సిరీస్లలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా శృంగార కోరికలపై ఆసక్తికర కామెంట్లు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. గాయత్రి గుప్తా తాజాగా మాట్లాడుతూ… అందరూ చెబుతున్నట్లుగా అబ్బాయిల కంటే అమ్మాయిలకే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి.. వీటివల్లే ఇల్లీగల్ ఎఫైర్ లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. కొద్ది రోజులు డేటింగ్ చేయడం, వారితో గడిపిన తర్వాత కోరిక తీరగానే విడిపోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లయిన వాళ్లు కూడా భర్త సుఖ పెట్టకపోతే ప్రత్యామ్నాయంగా ఇలాంటి ఎఫైర్ పెట్టుకుంటున్నారు అంటూ హాట్ బాంబు పేల్చింది.
కోరికలు ఎక్కువైతే అలా చేస్తాను..
అంతేకాదు అమ్మాయిలకు శృంగార కోరికలు ఎక్కువైతే వాటిని కంట్రోల్ చేసుకునే శక్తి కూడా పెంచుకోవాలని, ఆకలి వేస్తే అన్నం తింటే సరిపోతుంది కానీ శృంగారం అలా కాదు కదా.. అయినా అమ్మాయిలు అలాంటి పరిస్థితులు వస్తే తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి .. నా వరకు నేను ఆ ఫీలింగ్స్ వస్తే అలాగే కంట్రోల్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా. ఏది ఏమైనా అమ్మాయిలకు శృంగార కోరికలు ఎక్కువ అంటూ చెప్పి మరొకసారి హాట్ టాపిక్ గా మారింది గాయత్రి గుప్తా ప్రస్తుతం ఈమె షేర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బేబీ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు..
ఇదిలా ఉండగా మొన్న బేబీ సినిమా డైరెక్టర్ రాజేష్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా తనను హీరోయిన్గా తీసుకుంటానని చెప్పి స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఆఖరికి మోసం చేసి ఇంకో అమ్మాయిని తీసుకున్నాడు అంటూ హాట్ బాంబు పిలిచింది. అంతే కాదు బేబీ కథ వేరొకరిది అయితే రాజేష్ అతడి దగ్గర నుండి కొట్టేసి దొంగగా సినిమా చేశాడు అంటూ కూడా ఆరోపణలు చేసింది మొత్తానికి అయితే ఇలా ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తలో నిలుస్తోంది గాయత్రి గుప్తా.