Raj Tarun – Lavanya.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన ఈయన.. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోని ఇటీవల నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన కొంతకాలానికి తనను దాదాపు 11 సంవత్సరాల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుని, తనతో గడిపి, రెండు అబార్షన్లు చేయించాడు అంటూ లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది.. దీంతో అసలు నిజం బయటకు వచ్చింది..
ఆధారాలతో బయటపెట్టిన లావణ్య..
పోలీసులు ఆధారాలు సమర్పించాలని చెప్పడంతో ఆధారాలు బయట పెట్టడమే కాకుండా ప్రముఖ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రహస్యంగా ఎఫైర్ నడుపుతున్నాడంటూ హాట్ బాంబ్ పేల్చింది. అంతే కాదు ఆమెకు దగ్గర కావడం వల్ల తనను వదిలేసాడని ఎలాగైనా సరే తన భర్త తనకు కావాలి అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇంకా ఈ విషయం గురించి పూర్తి ఆధారాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై లావణ్య తండ్రి కూడా స్పందించారు.
రాజ్ తరుణ్ పై లావణ్య తండ్రి కామెంట్స్..
లావణ్య రాజ్ తరుణ్ ను ప్రేమించుకున్న మాట నిజమే అని , రాజు తరుణ్ కోసం లావణ్య తన సొంత డబ్బులో ఏకంగా 70 లక్షల రూపాయలను ఖర్చు పెట్టిందని, ఎంత డబ్బు పోయినా పర్లేదు రాజ్ తరుణ్ తన కూతురికి భర్తను చేస్తానని తెలిపాడు. అయితే లావణ్య తనను మోసం చేసిందని రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చాడు . ఆమె డ్రగ్ తీసుకుంటుందని ఇతర వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే గత మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు.. ఇలా పరాస్పర వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.. కానీ పూర్తిగా ఈ విషయం ఒక కొలిక్కి రాలేదని చెప్పాలి..
మొదటిసారి మీడియా ముందుకు రానున్న రాజ్ తరుణ్..
లావణ్య ఆధారాలు బయట పెట్టిన తర్వాత మీడియా ముందుకు రావడం మానేశారు. ఇక దీంతో ఈయన మీడియా ముందుకు ఎప్పుడు వస్తారు అని అభిమానులు ఎదురు చూస్తుండగా తాజాగా ఈయన నటించిన చిత్రం తిరగబడరా సామి.. మొన్న జరిగిన ఒక సినిమా ఈవెంట్ కి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడకు ఈయన హాజరు కాలేదు .అయితే రేపు లేదా ఎల్లుండి జరగబోయే తిరగబడే రా సామి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రెస్ మీట్ కి రాజ్ తరుణ్ కూడా హాజరవుతారని ఆ సినిమా నిర్మాత వెల్లడించారు. మరి రాజ్ తరుణ్ మొదటిసారి మీడియా ముందుకు రాబోతున్నారు. కాబట్టి లావణ్య విషయంపై స్పందిస్తారా అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. మరి రాజ్ తరుణ్ లావణ్య విషయంపై స్పందిస్తారా లేక సినిమా విషయాలపై మాత్రమే క్లారిటీ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా ఒక అమ్మాయి కేసులో
భారీగా అడ్డంగా బుక్ అయిపోయారు రాజు తరుణ్.
లావణ్య వివాదం తర్వాత తొలిసారి మీడియా ముందుకు రాబోతున్న రాజ్ తరుణ్
రేపు లేదా ఎల్లుండి జరగబోయే తిరగబడరసామి క్యూ అండ్ ఎ ప్రెస్ మీట్ కి రాజ్ తరుణ్ కూడా హాజరవుతారని తెలిపిన నిర్మాత #rajtarun
— Filmify Official (@FilmifyTelugu) July 30, 2024