Amardeep.. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సీరియల్ హీరో అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టిన తర్వాత ఊహించని క్రేజ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఏ రేంజ్ లో అయితే ప్రేక్షక ఆదరాభిమానాలు పొందారో, అదే స్థాయిలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవపడి నెగటివిటీ ను కూడా మూటగట్టుకున్నారు.. ఒకానొక సమయంలో పిచ్చివాడు, చేతవానికాడు లాంటి ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు అమర్ దీప్. అయినా సరే ఆయన పట్టుదలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంచి మనస్తత్వం గెలవాలనే తపన అన్నీ కూడా టాప్ ఫైవ్ వరకు తీసుకెళ్లాయి. చివరికి రన్నర్ గా నిలిచారు.
అమర్ కు మాట ఇచ్చిన రవితేజ..
ఇదే కాకుండా మాస్ మహారాజా రవితేజ తో కూడా నటించే అవకాశాన్ని కొట్టేశారు. నిజానికి మాస్ మహారాజా రవితేజ అంటే అమర్ కి పిచ్చి. బిగ్ బాస్ వేదికపై కూడా ఈ మేరకు రవితేజ పై తన ప్రేమను చాటుకున్నాడు.. ఇక అందులో భాగంగానే బిగ్ బాస్ వేదికపై రవితేజ కూడా అమర్ దీప్ కి మాట ఇచ్చారు. తన సినిమాలో అవకాశం ఇస్తానంటూ తెలిపారు. మరొకవైపు స్టార్ మా లో కొత్తగా కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అమరదీప్.ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. మరొకసారి హీరోయిన్ రాశీ తో కలిసి నటిస్తున్నట్లు ప్రకటించాడు.
రాశీ పై అమర్ దీప్ ఎమోషనల్ కామెంట్స్..
తాజాగా తన ఇంస్టాగ్రామ్ పోస్టులో మరోసారి మా అమ్మ రాశీ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. లవ్ యు సో మచ్ అమ్మ . నువ్వు ఒకసారి నవ్వితే చాలు చెప్పలేనంత పాజిటివ్ ఎనర్జీ నాలో కలుగుతుంది. నువ్వు ఎప్పుడు నా జీవితంలో ఒక బ్యాక్ బోన్ వి అమ్మ అంటూ షూటింగ్ సెట్ లో తీసుకున్న ఫోటోలను షేర్ చేశాడు అమర్ దీప్. ఇకపోతే గతంలో జానకి కలగనలేదు సీరియల్ లో వీళ్ళిద్దరూ తల్లి కొడుకులుగా నటించారు. ఈ కొత్త ప్రాజెక్టులో కూడా అమర్ కి తల్లిగానే రాశీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ సీరియల్స్ చేస్తున్నారా? లేక సినిమాలో చేస్తున్నారా? అన్నది క్లారిటీ ఇవ్వలేదు అమర్. ప్రస్తుతం అమర్ సీరియల్స్ ఏమీ చేయట్లేదు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి తన కూతుర్ని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఆమె కూతురు సుప్రీతా తోనే ఒక సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమా కూడా మొదలైంది.
బిగ్ బాస్ -8 లోకి తేజస్విని..
ఇక అమర్ భార్య తేజస్విని గౌడ విషయానికొస్తే, ఈసారి సీజన్ 8 లో ఈమె ఎంట్రీ ఇస్తుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు తేజస్విని క్లారిటీ ఇవ్వలేదు. తేజస్విని కోయిలమ్మ , అనసూయ వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్ను మెప్పించింది. కన్నడలో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు టీవీ షోలలో , డాన్స్ షోలలో పాల్గొంటూ ఆకట్టుకుంటుంది. మరి బిగ్ బాస్ ఎంట్రీ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.
View this post on Instagram