Sri Reddy.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీరెడ్డి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇతరులను టార్గెట్ చేయడమే తప్ప తనను టార్గెట్ చేసుకున్న రోజులు కనిపించవు.. అలాంటిది ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ముద్దుగుమ్మ.
మెంటల్ పరిస్థితి బాగాలేదు అంటున్న శ్రీరెడ్డి..
ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఈమె చేసిన పోస్ట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా తన మానసిక పరిస్థితి ఏమి బాగాలేదని, మెంటల్ ట్రామాలోకి వెళ్తున్నట్టు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తాను ఎప్పుడు సాధారణ స్థితికి వస్తానో కూడా తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తనను ఆ భద్రకాళియే కాపాడాలంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టింది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరిని రోడ్డుకు లాగే ఈమెకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితా అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఆత్మహత్య చేసుకోబోతున్నాను – శ్రీ రెడ్డి
మొదటిగా సురేష్ బాబు చిన్న కుమారుడైన అభిరామ్ తో ప్రైవేట్ గా గడిపిన దృశ్యాలను బయటపెట్టి వార్తల్లో నిలిచింది. అప్పటినుంచి దగ్గుబాటి ఫ్యామిలీనీ కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఆఖరికి నేచురల్ స్టార్ నానిని కూడా ఈమె వదలలేదు. అప్పట్లో తనకు న్యాయం చేయాలి అంటూ ఫిలింనగర్ కల్చర్ సెంటర్ ముందు అర్ధనర్థంగా ప్రదర్శన చేసి సంచలనం రేపింది. ఇకపోతే గత కొన్నేళ్ళు గా తనకు ఎక్కువగా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు వస్తున్నాయని, ముఖ్యంగా తనను తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ అలాగే మీడియా టార్గెట్ చేసి మరీ టార్చర్ పెడుతున్నారు అంటూ హాట్ బాంబ్ పేల్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక వీళ్ళ టార్చర్ భరించలేక ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని కూడా ఒక పోస్ట్ షేర్ చేసింది..
టిడిపి, జనసేన, మీడియా వల్లే.
అంతే కాదు తాను ఇంకా ఎన్ని రోజులు బ్రతికి ఉంటానో కూడా తెలియదని చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. శ్రీరెడ్డి తన పోస్టులో ఈ దాడులు, దారుణమైన మాటల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే వీటి నుంచి నాకు బయటకు ఎలా పడాలో అర్థం కావడం లేదు. నా ఈ స్థితిని చూసి చాలామంది నవ్వుకుంటున్నారని కూడా నాకు తెలుసు.. పైగా వైసిపి కూడా నన్ను తమ కార్యకర్తగా భావించడం లేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. మొత్తానికైతే శ్రీ రెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.