Malvi malhotra : రాజ్ తరుణ్ , లావణ్య కేసులో రోజుకొక కోణం వెలుగులోకి వస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ పై ఆయన ప్రేయసి లావణ్య ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రాజ్ తరుణ్ తాజాగా తిరగబడరా సామి సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడిగా మాల్వి మల్హోత్రా నటించింది.. ఇందులో మన్నారా చోప్రా కూడా కీలక పాత్రలో నటించారు. ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మించగా, ఆగస్టు 2వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోని చిత్ర బృందం తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేరుతో మీటింగ్ ఏర్పాటు చేయగా ఇందులో రాజ్ తరుణ్ , మాల్వి మల్హోత్రా ఇద్దరు పాల్గొని లావణ్య వివాదం పై స్పందించారు.
లావణ్య వివాదం పై స్పందించిన రాజ్ తరుణ్..
ఇప్పటివరకు వీరిద్దరిపై లావణ్య ఎఫైర్ రూమర్స్ సృష్టించి ఎన్నో కామెంట్లు చేయగా, ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న వీరు ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక్కసారిగా నోరు విప్పి ఆమె బాగోతాలను గుట్టు రట్టు చేశారు. ముందుగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. నాపై లావణ్య చేసిన ఆరోపణలలో నిజం లేదు. అందుకే ప్రతిసారి నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. నేను లావణ్య కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయను..ఆ అవసరం కూడా నాకు లేదు. అందుకే లీగల్ గా నేను ముందుకెళ్తున్నాను. నా వద్ద పూర్తి సాక్షాలు ఉన్నాయి కానీ ఆమె చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన సాక్షాలు కూడా ఎవరు అడగలేదు. ముఖ్యంగా లావణ్య నాపై పెట్టిన కేసు ఎఫ్ఐఆర్లో అబార్షన్ గురించి స్పందించలేదు. ఒకవేళ నిజమే అయితే మెడికల్ ఆధారాలు కూడా బయటికి రావాలి కదా.. ఆమె ఎందుకు వాటిని బయటకు తీసుకురావడం లేదు అంటూ ప్రశ్నించారు. పెళ్లి గురించి అంటారా నాకు అసలు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే లేదు. నేను కూడా మనిషినే కదా.. కావాలని నాపై ఇలాంటి ఆరోపణలు, నిందలు చేస్తే ఎక్కడికి వెళ్లలేక పోయాను.. 32 ఏళ్ళు నా జీవితంలో ఏ రోజు ఎలాంటి తప్పు చేయలేదు.. ఈ కారణం వల్ల నాతోపాటు నా తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
మాల్వీ కి మద్దతుగా రాజ్ తరుణ్..
అలాగే మాల్వి గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ లో ఆమెకు ఇదే మొదటి సినిమా కాబట్టి వివాదాలన్నీ పక్కన పెట్టేసి ఆమెను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాజ్ తరుణ్ కోరారు.
లావణ్య ఒక క్రిమినల్ – మాల్వీ
అలాగే ఈ వివాదాలపై మాల్వి మల్హోత్రా కూడా స్పందించింది.. అసలు ఆమెకు నాకు సంబంధమే లేదు. అలాంటిది నాతోపాటు నా సోదరుడిపై కూడా దారుణంగా కామెంట్లు చేస్తోంది. జూలై 24న లావణ్య నాకు మెసేజ్ చేసింది. నేను దానిని పోలీసులకు పంపాను. మేము ఎప్పుడు ఆమెను ఎప్పుడూ కలవలేదు. అలాంటిది మాపై ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తుందో నాకు తెలియదు.. 2020లో నాపై దాడి చేసిన కొంతమంది క్రిమినల్స్ తో ఆమె ఇప్పటికీ కూడా టచ్ లో ఉంది. వారితో టచ్ లో ఉండవద్దని నేను సలహా ఇచ్చాను ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్ అంటూ హాట్ బాంబు పేల్చింది.ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.