FilmIndustry For Kerala Victims : గత కొన్ని రోజుల క్రితం కేరళలో వాయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక గ్రామం పూర్తిగా నేలమట్టం అయిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేనంత భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడటంతో పాటు పెద్ద స్థాయిలో బురద గ్రామంలోకి వచ్చి అక్కడి ప్రజలని ముంచేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 250 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ఇప్పటికీ కొన్ని వందల మంది ప్రజలు అక్కడ గల్లంతయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక కేంద్రం నుండి NDRF, ఇండియన్ ఆర్మీ, ఫైర్ సిబ్బంది ఇప్పటికే అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేప్పట్టారు. ఇక ఈ ప్రకృతి విపత్తులో వేలమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వీరిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి తగిన చర్యలు తీసుకుంటుండగా, పలువురు సినీ సెలెబ్రిటీలు సైతం తమ వంతుగా విరాళాలు అందచేస్తున్నారు.
వాయనాడ్ బాధితుల కోసం సినీ స్టార్స్ విరాళాలు.. లిస్ట్ ఇదే!
ఇక కేరళ వాయనాడ్ వరద బాధితుల కోసం సినీ ప్రముఖులు విరాళాలు అందచేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు చేయూతనిచ్చారు. ఇక కేరళలో ఈ సంఘటన జరిగాక ముందుగా మళయాల సినీ ప్రముఖులతో సహా ఇతర ఇండస్ట్రీ స్టార్లు కూడా కేరళ ప్రజల కోసం విరాళాలు ప్రకటించారు.
ఇక విరాళాలు ప్రకటించిన స్టార్స్ లిస్ట్ ని గమనిస్తే..
ముందుగా మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి, అలాగే ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ స్పందించి, మమ్మోట్టి 20 లక్షలు, దుల్కర్ సల్మాన్ 15 లక్షలు రెస్క్యూ ఆపరేషన్ కోసం, తక్షణ సాయంగా కేరళ సీఎం పి. రాజీవ్ కు అందచేశారు.
అలాగే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ – నజ్రియా ఇద్దరూ 25 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి అందచేశారు. ఈ విషయాన్నీ వారి సొంత నిర్మాణ సంస్థ అయిన ఫహద్ & అండ్ ఫ్రెండ్స్ వారు ముఖ్యమంత్రికి రాసిన లేఖతో ప్రకటించారు.
అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య – జ్యోతిక, అలాగే సూర్య తమ్ముడు కార్తీ కూడా స్పందించి వారి తరపున 50 లక్షల రూపాయలు ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి సూర్య, జ్యోతిక, కార్తీ తమ విరాళాన్ని అందించడం జరిగింది. అలాగే కేరళ మృతుల కుటుంబాలకి సూర్య ఫ్యామిలీ తమ సానుభూతి తెలియజేశారు.
ఇక మరో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ కూడా 20 లక్షల రూపాయలు ప్రకటించారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న 10 లక్షల రూపాయలు ప్రకటించింది.