Malvi malhotra: రాజ్ తరుణ్ – లావణ్య కేసులో కీలకంగా మారిన పేరు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా. రాజ్ తరుణ్.. మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను దూరం పెడుతున్నాడు అంటూ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య పెద్ద ఎత్తున మీడియా ముందు రచ్చ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అనేక వివాదాలు రాజ్ తరుణ్ చుట్టూ ముసురుకుంటున్నాయి. రాజ్ తరుణ్ హీరోగా మాల్వి మల్హోత్రా హీరోయిన్గా తాజాగా తెరకెక్కిన చిత్రం తిరగబడరా సామి . ఈరోజు విడుదలైంది .. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్తో ప్రత్యేకంగా ముచ్చటించింది మాల్వీ మల్హోత్రా.
లావణ్య పై స్పందించిన మాల్వీ
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణల గురించి వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను అందుకే ఈ విషయాల పైన స్పందించట్లేదు అని చెబుతూనే తాను మాధవ్ హోటల్ లో కానీ గ్రీన్ పార్క్ హోటల్ లో కానీ స్టే చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా లావణ్య మాల్వీ మల్హోత్రాకు సంబంధించిన కొన్ని వాట్సప్ స్క్రీన్ షాట్లను పంపించిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ ఫ్యాబ్రికేట్ చేయబడిన చాట్స్ అంటూ మాల్వి మల్హోత్రా ఆరోపించింది. లావణ్య ఆరోపణల మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆమె చేస్తున్న అన్ని పనులపై కూడా నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.
అన్ని నిజాలు బయటకు వస్తాయి..
ముఖ్యంగా మన జ్యుడీషియల్ సిస్టం గురించి అందరికీ తెలుసు కదా.. నిజా నిజాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా కాస్త సమయం పడుతుంది. అందరూ ఎదురు చూడండి .నిజా నిజాలు ఏంటో బయటపడతాయి అంటూ మాల్వి మల్హోత్రా చెప్పుకొచ్చింది.
రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు
ఇకపోతే రాజు తరుణ్ తనను నమ్మించి, ప్రేమించి, ఒంటరిగా ఉన్నప్పుడు వివాహం చేసుకొని, కడుపు కూడా చేసి , ఇప్పుడు ఆ కడుపుని తీయించి, ఇంకో అమ్మాయి మోజులో పడి తనను వదిలేసాడు అంటూ ఆరోపిస్తోంది. తనకు ముఖ్యంగా గర్భస్రావం చేయించడానికి కారణం ప్రముఖ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా అంటూ, ఆమె మాయలో పడే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడు అంటూ కూడా చెబుతోంది. మరొకవైపు రాజ్ తరుణ్ లావణ్య చెప్పే విషయాలలో ఏది నిజం లేదని, ఆమెతో సహజీవనం చేసిన మాట నిజమే కానీ ఆమెను వివాహం చేసుకోలేదని చెబుతున్నాడు. ముఖ్యంగా మాల్వి మల్హోత్రా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిందని ఆమెను ఆ ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ కూడా తిరగబడరా సామీ ప్రమోషన్స్లో అభ్యర్థించారు.
ఎదురు చూడక తప్పదు..
మరి ఈ ముగ్గురిలో ఎవరు నిజం చెబుతున్నారు..? ఎవరు అబద్ధం చెబుతున్నారు ..? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు . నిన్నటి నిన్న లావణ్య రాజ్ తరుణ్ తో పెళ్లి జరిగిన ఫోటోలను బయటపెడతాను అని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఆ విషయాలపై ఎటువంటి క్లారిటీ లేదు. అలాగే రాజ్ తరుణ్ కూడా ఆమెతో గొడవపడడం ఇష్టం లేదని అందుకే లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నానని చెబుతున్నాడు. ఇక అన్ని నిజాలు తెలియాలి అంటే మాల్వి చెప్పినట్టు ఇంకొన్ని రోజులు ఎదురు చూడలేమో.. ఇక మాల్వి మల్హోత్రా చెబుతున్న మాటలను బట్టి చూస్తే లావణ్య క్యారెక్టర్ గురించి కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.