Lavanya – Shekhar Basha.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లావణ్య – రాజ్ తరుణ్ కేసు రోజుకొక మలుపు తీసుకుంటూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజ్ తరుణ్ తనను కడుపు చేసి, పెళ్లి చేసుకుని, అబార్షన్ చేయించి ఇప్పుడు మాల్వి మల్హోత్రా రావడంతో తనను వదిలేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించింది. అయితే రాజ్ తరుణ్ మాత్రం ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.ఆమె ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుంది అందుకే ఆమెతో ఉండలేక, విడిపోయాను అంటూ మీడియాతో చెప్పుకొచ్చారు. మరొకవైపు తనను బెదిరిస్తున్నారు అంటూ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడిపై లావణ్య చేసిన కామెంట్లను మాల్వి మల్హోత్రా తిప్పికొట్టే ప్రయత్నం చేసిందిm అసలు లావణ్యతో తన కుటుంబానికి తన ఎటువంటి సంబంధం లేదని, పరిచయమే చాలా తక్కువ అని , తన పరువుకు నష్టం కలిగిస్తోందని ఆమె కూడా కేసు పెట్టింది. ఇలా ఈ ముగ్గురు ఈ మధ్యకాలంలో విపరీతంగా వైరల్ అయ్యారు.
లావణ్య పై దాడి చేసిన రాజ్ తరుణ్ స్నేహితుడు..
ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా లావణ్య పై విచక్షణా రహితంగా కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె ఒక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని, ఆది భరించలేక రాజ్ తరుణ్ ఈమెను వదిలేసాడంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు లైవ్ లో డిబేట్ కూడా పెట్టాడు శేఖర్ బాషా అక్కడితో విడిచిపెట్టకుండా ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తాజాగా లావణ్య మీడియా ముందుకు వచ్చింది తన పై శారీరకంగా దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టాడు అంటూ ఆ గాయాలను సైతం మీడియాకు చూపించింది. అంతేకాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు స్పష్టం చేసింది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన లావణ్య ఈ విధంగా కామెంట్లు చేయడం గమనార్హం.
గోడు వెళ్లబోసుకున్న లావణ్య..
లావణ్య మాట్లాడుతూ.. శేఖర్ బాషాకు ఎంత డబ్బు ముట్టజెప్పారో నాకు తెలియదు. కానీ నాపై చాలా దారుణంగా దాడి చేస్తున్నాడు. శేఖర్ బాషా మొదట కడుపుపై తన్నాడు. తర్వాత వీపుపై తన్నాడు. ప్రైవేట్ పార్ట్స్ పై కూడా దాడి చేశాడు. రాళ్లు తగిలి బ్లడ్ కూడా వచ్చింది. ప్రస్తుతం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇప్పటివరకు మాటల వరకే ఉన్న శేఖర్ బాషా ఇప్పుడు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది. మొన్న రాత్రి మా ఇంటి కిటికీలలో నుంచి రాళ్లు కూడా విసిరాడు. చాలా భయంగా ఉంది. నాకు ఏం జరిగినా సరే శేఖర్ బాషా మాత్రమే కారణం. ఎంత వ్యక్తిగతంగా తీసుకోకపోతే ఆయన ఇంతలా మాట్లాడుతారు. ఎంత డబ్బు ఇచ్చింటారో ఒక్కసారి ఆలోచించండి.
ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు..
అలాగే ప్రీతీ , ఉదయ్ మాట్లాడుతున్న డ్రగ్స్ వ్యవహారానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. త్వరలోనే నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. డ్రగ్స్ కేసులో ఇరికించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వారి ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కుక్క పిల్లలను రోడ్డుకి వేసి ఆ ఇంటి తాళాలు వెయ్యాలన్నది రాజ్ తరుణ్ ప్లాన్. ఇదే విషయంపై శేఖర్ బాషా నాతో చాలెంజ్ చేస్తూ దుర్భాషలాడాడు. ఏమున్నా సరే నేను రాజ్ తరుణ్ తో చూసుకుంటాను. శేఖర్ బాషా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. దయచేసి అతడిని ఎంకరేజ్ చేయకండి.. క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడడమే కాదు ఫిజికల్ గా దాడి కూడా చేస్తున్నాడు. శేఖర్ బాషా పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
👉లావణ్య పై దాడి చేసిన RJ శేఖర్ బాషా
👉ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ లోను ఉండగా లావణ్య , శేఖర్ బాషా మధ్య వివాదం
👉లావణ్య కడుపు పై తన్ని, దాడి చేసిన శేఖర్ బాషా
👉గాయాలతో డయల్ 100 కి సమాచారం ఇచ్చిన లావణ్య pic.twitter.com/JCTu5mDlNh— ChotaNews (@ChotaNewsTelugu) August 4, 2024