HyperAadi : సందు దొరికితే చాలు అల్లేసుకుంటున్నాడు ఆది..

HyperAadi : టాలీవుడ్ లో జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో తనదైన శైలిలో కమెడియన్ గా అలరిస్తున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ డైహార్డ్ ఫ్యాన్ గా చెప్పుకునే హైపర్ ఆది తనకు అవకాశం దొరికినప్పుడల్లా అభిమానాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఇక ఇండస్ట్రీ లో ఎవరు మెగా ఫ్యామిలీ ని ట్రోల్ చేసినా, అలాగే రాజకీయ నాయకులూ ట్రోల్ చేసినా, హైపర్ ఆది తనదైన పంచ్ లతో సెటైర్లతో సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన కోసం హైపర్ ఆది చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. అందుకే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా హైపర్ ఆదిని మెచ్చుకుంటూ అండదండగా ఉంటారు. ఇదిలా ఉండగా ఈ వారం టాలీవుడ్ లో “కమిటీ కుర్రోళ్ళు” అనే సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

HyperAadi sensational comments at Committee Kurrollu pre-release event

సినిమాలో 11మంది హీరోలు.. కాబట్టి హిట్టవుద్ది – ఆది

ఇక హైపర్ ఆది కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తన పంచ్ లతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇక హైపర్ ఆది మాట్లాడుతూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మా నాగబాబు కూతురు ప్రొడ్యూసర్ అని తెలిసి వచ్చానని చెప్పుకొచ్చాడు. ఇక నిహారిక గురించి చెప్తూ వాళ్ళ బాబాయ్ లా ట్రెండ్ సెట్ చేసే రకం అని, అందుకే 11 మంది హీరోలని పెట్టి ఒక సినిమా చేసింది..అన్నాడు. ఇక పదకొండు మంది అంటే మనకు గుర్తొచ్చేది రీసెంట్ గా 11 మంది క్రికెటర్లు కలిసి మనదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. అలాగే ఈ పదకొండు మంది హీరోలు నిహారిక కి మంచి విజయాన్ని తీసుకురావాలని అన్నాడు. అలాగే తెలుగు వాళ్ళకి ఇప్పుడు 11 అంటే ఇంకోటి కూడా గుర్తొస్తది అని ఆపేసాడు… అప్పటికే అక్కడున్న వాళ్ళకి అది అర్థమై నవ్వేశారు. అలాగే అక్కడున్న వాళ్ళందరి గురించి హైపర్ ఆది తనదైన శైలిలో ప్రశంసించాడు.

- Advertisement -

సందు దొరికితే అల్లేసుకునే ఆది..

ఇక హైపర్ ఆది తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ 11 అనే పదం మాత్రం హైపర్ ఆది వదలడం లేదు. ఆ మధ్య ఓ కామెడీ షో లో కూడా పదాన్ని గట్టిగా వాడాడు. సందు దొరికితే పంచ్ లతో అల్లేసి ఆది తనకి మైక్ దొరికితే ఊరుకుంటాడా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగగా, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అలాగే అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు