Kavya Thapar.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసింది ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఇదే కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు..ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి .ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు హీరోయిన్లు ఉండగా, డబుల్ ఇస్మార్ట్ లో మాత్రం కావ్య మాత్రమే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కావ్య థాపర్ మీడియాతో ముచ్చటిస్తూ ఈ సినిమాలో అవకాశం రావడం పై పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది.
ఇస్మార్ట్ శంకర్ కి వద్దన్నారు కానీ..
కావ్య థాపర్ మాట్లాడుతూ.. రామ్ , పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆడిషన్స్ కి కూడా నేను వెళ్ళాను. కానీ సెలెక్ట్ అవలేదు. కానీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి పిలుపు వస్తే వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కానీ ఇందులో నేనొక్కదాన్నే అని.. అయితే పార్ట్ వన్ లో ఇద్దరు హీరోయిన్స్ లో సెలెక్ట్ కాకపోయినా డబుల్ ఇస్మార్ట్ లో సింగిల్ హీరోయిన్ గా నేను సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ కావ్య థాపర్ చెప్పుకొచ్చింది.
కావ్య థాపర్ సినిమాలు..
ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. ఈ సంవత్సరం ఇప్పటికే ఈగల్, ఊరు పేరు భైరవకోన వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో రాబోతోంది. ఈ సినిమా తర్వాత విశ్వం అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో టాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.
పూరీ జగన్నాథ్ సినిమాలు..
పూరీ జగన్నాథ్ కెరియర్ విషయానికి వస్తే,ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రెస్టేజియస్ గా మారిన విషయం తెలిసిందే. ఎందుకంటే విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా చిత్రం లైగర్ భారీ అంచనాల మధ్య తెరకెక్కించి విడుదల చేయగా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా. దాంతో పూరి జగన్నాథ్ కి కుర్ర హీరోలు కూడా అవకాశం ఇవ్వడానికి భయపడ్డారు. అందుకే ఈసారి మళ్లీ తనను తాను నిరూపించుకోవడానికి పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కచ్చితంగా పూరీ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.