Sai Pallavi.. ప్రముఖ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సౌత్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లు ఈమె కూడా ఒకరు. అద్భుతమైన చిరునవ్వుతో, అందంతో అందరినీ ఆకట్టుకునే ఈమె పర్ఫామెన్స్ విషయంలో బెస్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.నిజానికి సాయి పల్లవి స్టోరీ మొత్తం విన్న తర్వాత తన పాత్ర నచ్చితేనే చేయడానికి ఒప్పుకుంటుందని సమాచారం. కథ నచ్చకపోతే అవతల ఉన్నది పెద్ద స్టార్ హీరో అయినా సున్నితంగా రిజెక్ట్ చేస్తుందట. ఈ జనరేషన్లో ఇటు డాన్స్ అటు నటనపరంగా బెస్ట్ యాక్టర్స్ జాబితాలో సాయి పల్లవి నంబర్ వన్ స్థానంలో ఉంటుందనటంలో సందేహం లేదు.
ప్రతి భాషలో తానే డబ్బింగ్..
ఈమెలో మరొక టాలెంట్ కూడా ఉంది. ఈ టాలెంట్ చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అదేంటంటే ఏ భాషలో సినిమా చేసినా సరే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది అంతేకాదు పారితోషకం విషయంలో కూడా నిర్మాతలకు అనుకూలంగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా ఎవరైనా సరే ఒక సినిమాతో భారీ విజయం అందుకొని సక్సెస్ అయ్యారు అంటే కచ్చితంగా తమ తదుపరి చిత్రానికి పారితోషకం పెంచేస్తూ ఉంటారు. కానీ ఈమె అలా కాదు తన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సరే పారితోషకం విషయంలో ఏమాత్రం కూడా డిమాండ్ చేయదు. నిర్మాతలు చెప్పినంత తీసుకుంటూ ఉంటుందట. డబ్బు కంటే పాత్రలో నటించడమే ఇంపార్టెంట్ అని, ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే టార్గెట్గా పెట్టుకుంది ఈ డాక్టరమ్మ.
ఒకవైపు యాక్టర్ మరోవైపు డాక్టర్..
సాయి పల్లవి వృతిరీత్యా డాక్టర్. ఒకవైపు తన కోరికను సినిమాల ద్వారా తీర్చుకుంటూనే , మరొకవైపు పేద ప్రజలకు వైద్యురాలిగా సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసు చాటుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి పల్లవి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం సాయి పల్లవి మరొకసారి నాగచైతన్యకు జోడిగా తండేల్ సినిమాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ సరసన రామాయణంలో సీతగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈమె వ్యక్తిత్వం గురించి నిర్మాతలు కూడా గొప్పగా చెబుతూ ఉండడం గమనార్హం.
అందుకే సాయి పల్లవి అంత స్పెషల్..
ఇదిలా ఉండగా సాయి పల్లవి గురించి పడి పడి లేచే మనసు సినిమా నిర్మాత చాలా గొప్పగా చెప్పుకొచ్చారు లవ్ స్టోరీని డిఫరెంట్ గా హను రాఘవపూడి తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ కథ బాగున్నా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ సినిమాని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి , ప్రసాద్ చుక్కపల్లి నిర్మించడం జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. దీనితో సాయి పల్లవి తన పారితోషకంలో కొంత మాత్రమే తీసుకొని మిగతాదంతా వదిలేసిందట. సాధారణంగా హీరోయిన్స్ పారితోషకం ముందుగానే తీసుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం నిర్మాతలకు నష్టం వచ్చిందని గమనించి, వెనక్కి ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోలలో దాదాపు పవన్ కళ్యాణ్ మాత్రమే చాలాసార్లు తను రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారు. ఇప్పుడు ఆయన బాటలోని ఈమె కూడా ఇలా చేస్తుంది. అందుకే సాయి పల్లవి అందరికంటే చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు.