Harish Shankar : ఈ ఆగస్టు 15న సినిమాల వార్ మాములుగా లేదు.. రెండు సినిమాలు భారీ అంచనాలతో విడుదల కాబోతున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఢీ అంటున్నాయి. వీటితో పాటు చియాన్ విక్రమ్ తంగలాన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. అయితే పూరి జగన్నాథ్ సినిమాకి పోటీగా హరీష్ శంకర్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో దీనిపై క్లారిటీ వచ్చినా కూడా ఇద్దరి ఫ్యాన్స్ లో ఏదో టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ పూరిని పొగుడుతూ అతనే గ్రేట్ అనడంతో రవితేజ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా కూడా దెబ్బస్తుందా అని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ పూరి గురించి సంచలన విషయాలను చెప్పాడు.. రైటర్, డైరెక్టర్గా పూరి ప్రభావం మీపై ఎంత ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకి హరీష్ సమాధానం చెప్పాడు. ఇడియట్ తర్వాత వచ్చిన రైటర్లు అందరిపైనా పూరి జగన్నాథ్ ప్రభావం ఉంటుంది. హీరోకి యాటీట్యూడ్ నేర్పించిందే ఆయనే. పూరి గారి దగ్గరికి నేను వెళ్లాక నా ఇన్ సెక్యూరిటీ పోయింది. రాస్తే నచ్చుతుందా లేదా ఎవరైనా ఏదైనా అనుకుంటారా అనే ఫీలింగ్ పోయింది. పూరి గారు ఒక డైరెక్టర్ కాదు ఒక కల్ట్. ఆయన సినిమాలి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ఆయన చేసిన సినిమాలు హిట్ అవ్వాల్సిందే అంటూ పొగడ్తలు కురిపించాడు.
ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో రవితేజ ఫ్యాన్స్ భయపడుతున్నారు. వీరిద్దరి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఆగస్టు 15 న రిలీజ్ కాబోతున్నాయి. నిన్నటివరకు పోటి బాగుందనే టాక్ వినిపించినా.. ఇప్పుడు మాత్రం మాస్ మహారాజ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. హరీష్ ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలే అందుకు కారణం అని తెలుస్తుంది.. ఈ సినిమా హిట్ అవుతుందా? లేదా తమ హీరో ఖాతాలో మరో ప్లాప్ పడుతుందా? అని ఆలోచిస్తున్నారు. దీనిపై హరీష్ ఎలా స్పందిస్తారో చూడాలి. రవితేజ కూడా సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. ఏది ఏమైనా డబుల్ ఇస్మార్ట్ కన్నా మిస్టర్ బచ్చన్ సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి ఏ సినిమా హిట్ టాక్ ను అందుకుంటుంది.. ఎంత కలెక్షన్ ను రాబడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి..