Bigg Boss 8: మేకర్స్ ఊహించని నిర్ణయం..వారికి నో ఎంట్రీ..!

Bigg Boss 8.. తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ త్వరలోనే సీజన్ 8 ప్రారంభానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నిర్వహకులు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం హౌస్ లోకి కొత్తగా వెళ్లాలనుకునే వారికి ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ నిర్వహకులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ చేసిన పని అని తెలుస్తోంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Bigg Boss 8: Makers Unexpected Decision..No Entry For Them..!
Bigg Boss 8: Makers Unexpected Decision..No Entry For Them..!

మాట తప్పిన పల్లవి ప్రశాంత్..

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ విన్నర్ గా నిలిచారు. గతేడాది డిసెంబర్ 17న ఫినాలే జరగగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ – పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడులు చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి మరి అమర్దీప్ కారుపై దాడి చేయడమే కాదు.. అన్నపూర్ణ స్టూడియో నుండి ప్రశాంత్ బయటకి రాకముందే పరిస్థితి అదుపుతప్పి.. ప్రైవేటు వాహనాలతో పాటు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులపై కూడా రాళ్లు విసిరారు. ప్రశాంత్ కి పోలీసులు సూచనలు చేశారు. ఎలాంటి ర్యాలీ చేయకుండా ఇంటికి వెళ్లి పోవాలని , వెనుక డోర్ నుంచి కూడా పంపించారు. అయినా పోలీసులు మాట లెక్క చేయలేదు పల్లవి ప్రశాంత్. పెద్ద ఎత్తున ర్యాలీ చేయడంతో పోలీసులు ఇతడి పై కేసు నమోదు చేశారు. అరెస్టు చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతడి తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రెండు రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడానికి రైతు అనే సింపతి బాగా వర్క్ అవుట్ అయింది. అదే సమయంలో ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని మాట ఇచ్చాడు. కానీ మాట తప్పడు. ఇప్పటికీ కేవలం రూ.1.20 లక్షలు మాత్రమే పెంచాడు నిజానికి రూ.16 లక్షలు పల్లవి ప్రశాంత్ పంచాలి అయితే సాయం విషయంలో కూడా మాట తప్పాడు. బిగ్ బాస్ ఇమేజ్ డామేజ్ చేశాడు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.

ప్రశాంత్ కారణంగా హౌస్ లోకి సామాన్యులకు నో ఎంట్రీ..

ఇకపై సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్బాస్ షో కి సామాన్యులను ఎంపిక చేయకూడదు నిర్ణయించుకున్నారట. దీంతో హౌస్ లోకి వెళ్లాలనుకున్న చాలామంది సామాన్యుల కలలపై పల్లవి ప్రశాంత్ నీళ్లు చల్లినట్టే అని చెప్పాలి. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 లో సామాన్య ప్రజలకు అవకాశం లేకపోవడం గమనార్హం . ఏది ఏమైనా చాలామంది హౌస్ లోకి వెళ్లాలని తమ కోరికను బయటపెట్టారు. కానీ పల్లవి ప్రశాంత్ చేసిన పని వల్ల హౌస్ లోకి సామాన్యులకు ఎంట్రీ లేకపోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు