SaifAlikhan : బాలీవుడ్ స్టార్ హీరోలలో సైఫ్ అలీఖాన్ ఒకరు. మూడున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ ఆది పురుష్ లో విలన్ గా నటించిన ఈ హీరో, ఇప్పుడు వరుస సౌత్ సినిమాలలో విలన్ గా నటిస్తూ బిజీ అవుతున్నాడు. క ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ భైరా పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ హీరోకి తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో మీడియాతో కాస్త తొందరపడ్డాడని తెలుస్తుంది.
సహనం కోల్పోయిన సైఫ్…
సైఫ్ అలీఖాన్ తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.అక్కడ సైఫ్ థన్ ఫ్లైట్ టైం అవుతుందని వెళ్తుండగా, అతడికి అక్కడున్న స్టిల్ ఫోటోగ్రాఫర్లతో ఊహించని ఘటన ఎదురయింది. సైఫ్ ఎయిర్ పోర్ట్ లోకి టెర్మినల్ వద్దకు రాగానే ఫోటోగ్రాఫర్లు అతనిపై కాస్త ఎటాక్ చేయడంతో ఇబ్బందిగా ఫీలైన సైఫ్ తన సహనాన్ని కోల్పోయారు. అయితే మొదట్లో సైఫ్ సహకరించినప్పటికీ బెటర్ లైట్ లోకి రావాల్సిందిగా మరోసారి ఫోటోగ్రాఫర్లు సైఫ్ ని అడగడంతో అతడి సహనం తగ్గిపోయింది. అప్పుడు సైఫ్ తన చికాకుగా “తో మెయిన్ క్యా కరూ?” (నేనేం చేయాలి?) అని అన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తుంది.
కొంతమంది సైఫ్ ఇలా చేయాల్సింది కాదని ఫైర్ అవుతుంటే, మీడియా కూడా ఈ మధ్య కొంచెం వారికి ప్రైవసీ కూడా ఇవ్వకుండా అతి చేస్తున్నారు అంటున్నారు. మరికొందరయితే ఈ బాలీవుడ్ లో ఇది కామనే.. అందరూ ఇంతే అంటున్నారు. ఇదియే ఏమైనా ఈ రోజుల్లో ఎవరి బిజీ వాళ్ళది. సెలెబ్రిటీలను మరీ బూతద్దం లో పెట్టినట్టు చూస్తే చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. వాళ్ళు కూడా మనుషులే కదా అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదిలా ఉండగా సైఫ్ అలీఖాన్ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు.