Double Ismart : పూరి సినిమాకు మరో అడ్డంకి… మూవీ రిలీజ్ అవ్వకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్…?

Double Ismart : పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్. సినిమా పైన ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పైన ఇప్పటికీ అనుమానాలు మాత్రం తీరలేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తుంది. రోజుకో కొత్త సమస్య తలెత్తుతుంది. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ కూడా పెద్దగా ఆకట్టుకునేది లేదు. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుందని ఆ ట్విస్ట్ పోకిరి రేంజ్ లో ఉండబోతుందని సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాను ప్రైమ్ షో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు.

పూరి జగన్నాథ్ చివరగా దర్శకత్వం వహించిన సినిమా లైగర్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. పూరి జగన్నాథ్ కెరీర్ లో వచ్చిన అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇది. ఈ సినిమాతో పూరి చాలా కోల్పోయాడు. సొంత ఆఫీస్ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అప్పట్లో గొడవ చేసిన సంగతి కూడా తెలిసింది. దీనిపైన పూరి రియాక్షన్ ఆడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అంతా మరొకసారి పూరి సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి తమకు రావాల్సిన డబ్బులు చేసే పనిలో పడ్డారు.

అయితే ఇది కాకుండా ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి మరో సమస్య తలెత్తింది. మై హోమ్ గొడవ జరుగుతున్నట్లు తెలుస్తుంది. వాళ్లకు 40 కోట్లు వరకు పూరి చెల్లించాల్సి ఉందని అవి ఇప్పటివరకు ఇవ్వలేదని వాళ్లు సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మూవీ రిలీజ్ అవ్వకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చి పనిలో పడ్డారు మై హోమ్ సంస్థ. నేడు సాయంత్రానికి ఎగ్జిబిటర్స్ సమస్య ఒక కొలిక్కి వచ్చి అవకాశం ఉంది. అయితే సినిమాని ఒకవేళ అడ్డుకున్నట్లయితే ప్రైమ్ సో సంస్థ ఇంకా చేతులెత్తేసినట్టే. ఇకపోతే మరోవైపు ఇస్మార్ట్ హక్కులను చదలవాడా అడిగారు అని తెలుస్తుంది ఒకవేళ ఆయనకి ఇచ్చినట్లయితే నైజంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసినట్లే. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు అవుతుందని గ్యారెంటీ కూడా లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు