Puri Jagannadh: ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమా చేశాను

Puri Jagannadh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకప్పుడు టక్కును వినిపించే పేరు పూరి జగన్నాథ్. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కు సరైన హిట్ పడలేదు. అయితే ఈ మధ్యలో రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ సినిమాకి మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఆ సినిమా తర్వాత చేసిన మెహబూబా, రొమాంటిక్ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్ బీభత్సమైన నష్టాలను తీసుకొచ్చింది.ఆ సినిమాకి 200 కోట్లు వస్తుందని మొదట అంచనా వేశారు. కానీ ఆ సినిమా మినిమం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు.

ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అన్న సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈవెంట్ లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను అంటూ చెప్పాడు. రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. కేవలం క్యారెక్టర్ తో సినిమాను నడిపించవచ్చు అనే విధంగా పూరి తన సినిమాలను డిజైన్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు.

Double iSmart

- Advertisement -

ఇకపోతే పూరి జగన్నాథ్ ను చిన్న కాన్సెప్ట్ సినిమాలు స్టార్ డైరెక్టర్ చేశాయి. పూరి జగన్నాథ్ స్టార్ట్ డైరెక్ట్ అయిపోయిన తర్వాత చిన్న కాన్సెప్ట్ సినిమాలు చేయడం మానేశాడు. పూరి జగన్నాథ్ కెరీర్ లో ఇడియట్,అమ్మ నాన్న తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించాయి. ఒక వారం రోజుల్లో కథను రాసి ఇంకో వారం రోజుల్లో డైలాగ్స్ రాసి ఆ సినిమాను తీసేయడం పూరి స్టైల్. కానీ రీసెంట్ టైమ్స్ లో పూరి ఒక సినిమాను ఫినిష్ చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. ఏదేమైనా ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీశానని పూరి జగన్నాథ్ చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం అనేది ఆగస్టు 15న తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు