Puri Jagannadh: నేను రోడ్డు మీదకు వచ్చేసిన నా వెనక ఒకడు నిల్చుంటాడు

Puri Jagannadh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను పూరి జగన్నాథ్ తీశాడు. అలానే ఎన్నో డిజాస్టర్లు కూడా పూరి జగన్నాథ్ కెరీర్ లో ఉన్నాయి. అయితే పూరి సినిమాల గురించి పక్కన పెడితే పూరీ జగన్నాథ్ వ్యక్తిగత జీవితం చాలా మందికి ఇన్స్పైరింగ్ అని చెప్పాలి. పూరి పర్సనల్ గా ఎంతో డబ్బులని నష్టపోయిన కూడా మళ్లీ తిరిగి దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ పరిస్థితి ఇస్మార్ట్ సినిమా మీద ఆధారపడి ఉంది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ సిద్ధంగా ఉంది.

ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్లో పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్స్ సీఈఓ విస్సు రెడ్డి గురించి మాట్లాడుతూ.. ” జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత నా దగ్గర ఒక రూపాయి కూడా లేకపోయినా నేను రోడ్డు మీదకు వచ్చేసింది తర్వాత నా వెనుక ఒకడు నిలిచి ఉంటాడు. వాడే విస్సు రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. ఒక విస్సు రెడ్డి విషయానికొస్తే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.

Puri Jagannadh

- Advertisement -

వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తాడు విస్సు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మెహబూబా సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. అక్కడితో పూరి చేసే సినిమాలు లో ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉండేవాడు. లైగర్ సినిమాలో కూడా ఒక పాత్రను చేశాడు. ఇలా నటుడుగా చేస్తూ పూరి కనెక్ట్స్ కి లావాదేవీలు చూసుకుంటూ ఆ సంస్థకి ఒక బ్యాక్ బోన్ ల నిలబడ్డాడు. అందుకే పూరీ జగన్నాద్ విస్సు గురించి ఆ రేంజ్ లో మాట్లాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు