Chiranjeevi: కన్ఫ్యూజన్లో చిరంజీవి.. అదే కారణమా..?

Chiranjeevi.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి కన్ఫ్యూజన్లో పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి డైలమాలో పడితే మిగతా స్టార్ హీరోల పరిస్థితి ఏంటి? అంటూ పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Chiranjeevi: megastar is on full of confusion.why.?
Chiranjeevi: megastar is on full of confusion.why.?

రీమేక్ లకు దూరం అంటున్న చిరంజీవి..

గత ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి అదే ఏడాది భోళాశంకర్ సినిమాతో బొక్క బోర్ల పడ్డారు. అందుకే ఇకపై రీమేక్ చిత్రాలు చేయకూడదని నిర్ణయానికి వచ్చారట చిరంజీవి. అంతే కాదు ఎటుపడితే అటు సినిమాలకు ఓకే చేయకుండా తన ఇమేజ్ కి తగ్గ సినిమాలు మాత్రమే ఎంచుకుంటున్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే భోళాశంకర్ సినిమా తర్వాత చేయాలనుకున్న సినిమాలను పక్కనపెట్టి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇక్కడ ఈ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని , అందుకే ఈ సినిమాకి ముల్లోక వీరుడు అనే టైటిల్ ని కూడా అనుకున్నారు అయితే ఆ తర్వాత విశ్వంభర టైటిల్ ను ఫిక్స్ చేయడం జరిగింది.

భోళా శంకర్ దెబ్బ మామూలుగా లేదుగా..

ఇకపోతే ఒకప్పటిలా రీమేక్ సినిమా అంటే మన ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. ఏదో కొద్ది మందికి మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ తో పాటు ఓటిటి వేదికలు కూడా బాగా పెరగడంతో అన్ని సినిమాలు చూసేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఈమధ్య పూర్తిగా మారిపోయింది. ఎవరైన స్టార్ హీరో చేస్తున్న సినిమా ఫలానా రీమేక్ అంటే మాత్రం ఆడియన్స్ కూడా నెట్ లో ఆ సినిమాను గూగుల్ చేసి మరీ చూస్తూ ఆ ఒరిజినల్ సినిమాకు పాపులారిటీ పెంచేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఆయా హీరోల సినిమాలు రీమేక్ చేసిన ఆ రెండు సినిమాలను కంపారిజన్ చేస్తూ తప్పులను బయటపెడుతున్నారు. ఒకవేళ సినిమా బాగుంటే ఓకే కానీ ఏదైనా తేడా కొట్టిందంటే మాత్రం సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి లాస్ట్ మూవీ భోళాశంకర్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది.

- Advertisement -

నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్ఫ్యూజన్లో పడ్డ చిరంజీవి..

తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. మొత్తంగా మెహర్ ని నమ్మిన చిరంజీవికి ఈ సినిమా అత్యంత దారుణమైన డిజాస్టర్ ను అందించింది. దీంతో మెహర్ రమేష్ తో సినిమా అంటేనే మెగా అభిమానులు భయపడుతున్నారు. రీమిక్స్ సినిమా అనగానే డిజాస్టర్ అవుతుందని అనుకున్న మెగా అభిమానులు.. ఊహించినట్టుగానే భోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే భోళా శంకర్ తర్వాత చేద్దామనుకున్న బ్రో డాడీ కూడా వాయిదా పడబోతోందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడు డిసెంబర్ తర్వాత చిరంజీవి ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ సబ్జెక్టుతో దర్శకులు చిరంజీవిని సంప్రదిస్తారా అనేది కూడా డౌటే. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటో ఆయనకే తెలియక కన్ఫ్యూజన్లో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిరంజీవి ఆలోచన ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు