Keerthi Suresh.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి క్రేజీ సంపాదించిందో చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ టేకింగ్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ప్రభాస్ కూడా ఈ సినిమాతో మరొక మెట్టు పైకి ఎదిగారు. మహాభారతానికి కల్కి చిత్రాన్ని లింకు చేస్తూ తెరకెక్కించడంతో బాగానే సక్సెస్ అయ్యింది. ఇందులో చాలా మంది నటీనటులు, డైరెక్టర్లు కూడా నటించడం జరిగింది. ప్రభాస్ ని కర్ణుడు పాత్రలో చూపించిన తీరు అభిమానులకు బాగా ఆకట్టుకుంది. కీర్తి సురేష్ కూడా ఇందులో బుజ్జి అనే పాత్రకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది.
బుజ్జి క్యారెక్టర్ వాయిస్ తో ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి సురేష్..
కల్కి – బుజ్జి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ కల్క్ సినిమాకి సంబంధించి పలు తెలియని విషయాలను తెలియజేసింది.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రంలో అలనాటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా.. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో కీర్తి సురేష్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ఆ చనువుతోనే ఈమెకు కల్కి సినిమాలోని బుజ్జి క్యారెక్టర్ వాయిస్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వగా ఆమె కూడా అందుకు ఓకే చెప్పిందని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ అసలు విషయం వేరే ఉందట.
కల్కి చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిన కీర్తిసురేష్..
అదేమిటంటే వాస్తవానికి కల్కి 2898AD చిత్రం లోని ఒక పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంపిక చేశారట. అయితే తాను ఆ పాత్ర చేయలేనని చెప్పేయడంతో పాటుగా తాను కూడా కల్కి సినిమాలో ఒక భాగం కావాలనుకుంటున్నానని నాగ్ అశ్విన్ కు కీర్తి సురేష్ మెసేజ్ పెట్టిందట. అలాంటి సమయంలో బుజ్జి పాత్రకు వాయిస్ ఇవ్వగలవా అని అడగగా, అందుకు ఆమె వెంటనే ఓకే చెప్పేసారని తెలిపింది. అయితే కల్కి చిత్రంలో ఒక పాత్ర మిస్ అయినందుకు నేను బాధపడలేదు. ఎందుకంటే బుజ్జి వాయిస్ తో మరింత ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపింది కీర్తి సురేష్.
కల్కి 2 కోసం వెయిటింగ్..
కానీ కీర్తి సురేష్ కు నాగ్ అశ్విన్ ఏ పాత్ర ఆఫర్ చేశారనే విషయం పైన ఈ ముద్దుగుమ్మ తెలియజేయలేదు.. ప్రస్తుతం కల్కి రెండవ భాగం కోసం చాలామంది ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. మరి కల్కి రెండవ భాగంలో ఏ ఏ సెలబ్రెటీలు ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి.
కీర్తి సురేష్ కెరియర్..
కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ఇటీవలే దసరా సినిమా లో నటించినందుకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తదుపరి ప్రాజెక్టులతో ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.