Raj Tarun – Lavanya : హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. లావణ్య రాజ్ తరుణ్ పై పెట్టిన కేసుల పై స్పందించిన ఆయన మస్తాన్ సాయి అనే పేరును ప్రస్థావించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతను ఎవరు? వీరిద్దరికి అతనికి ఏం సంబంధం అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మస్తాన్ అరెస్ట్ తర్వాత లావణ్య మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టింది.
గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తెలిపింది. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా దాడులు చేశారు పోలీసులు. ఐతే అప్పట్లో పోలీసుల కళ్లుగప్పి మస్తాన్సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అతని ఫోన్ చెక్ చెయ్యగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..
మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రయివేటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని ఇతను అమ్మాయిలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.
ఇక తాజాగా మస్తాన్ సాయి అరెస్ట్ పై లావణ్య స్పందించింది. అసలు వీరిద్దరికీ ఎలా పరిచయం అనే విషయాలను ఓ బిగ్ టీవీ ఛానెల్ తో మాట్లాడిన ఫోన్ కాల్ లో బయట పెట్టింది. మస్తాన్ సాయి అరెస్ట్ గురించి తనకు ఇప్పుడే తెలిసిందని, వరలక్ష్మి టిఫెన్ సెంటర్ కేసులో తమ పేర్లు కావాలనే ఇరికించారని ఆరోపించింది. రాజ్ తరుణ్ కేసులో సెటిల్మెంట్ కోసం రూ. కోటి డిమాండ్ చేశారని పేర్కొంది. తాను కూడా మస్తాన్ సాయి బాధితురాలినేని వెల్లడించింది. అతనికి వర్జిన్ అమ్మాయిలే కావాలని సంచలన విషయాన్ని బయట పెట్టింది. చాలా మంది అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వాడుకున్న అతని వల్ల నాకు ప్రాణ హాని ఉందని, అందుకు అతని పేరు చెప్పలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అతని ఫోన్లు 800 లకు పైగా అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..