Nani : నేచురల్ స్టార్ నాని నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ అయిన కాసేపటికే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇక సరిపోదా శనివారం ట్రైలర్ ని నిన్న హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య రిలీజ్ చేయడం జరిగింది.
నేచురల్ స్టార్ కి పీకే ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్..
ఇదిలా ఉండగా సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ సుదర్శన్ 35ఎంఎం లో జరిగగా, ఈ థియేటర్ కి నాని (Nani) ఫ్యాన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న “ఓజి” (OG) చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం కూడా దానయ్య నిర్మిచాడు. అందువల్ల ఓజి అప్డేట్ ఏమైనా ఇక్కడ చెప్తారేమో అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావించారు. ఇదిలా ఉండగా సరిపోదా శనివారం సినిమాకి థియేటర్స్ వద్ద నాని ఫ్యాన్స్ తో పాటు పీకే ఫ్యాన్స్ కూడా హంగామా చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా నానికి తన సినిమాకు ఫుల్ సపోర్ట్ తెలియచేస్తున్నారు. ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నాని నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు నాని సరిపోదా శనివారం చిత్రానికి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.
భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధం..
ఇక నాని సినిమాలకు ముందు నుండి పాజిటివిటి ఉంటుండగా, వివాదాలకు దూరంగా ఉండే, నాని అంటే ఇతర హీరోల ఫాన్స్ కూడా ఇష్టపడతారు. ఇక సరిపోదా శనివారం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, ఆగష్టు 29న థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే సాయి కుమార్, అభిరామి, అజయ్ ఘోష్, కాళి, మార్టిన్, మురళీశర్మ, అజయ్, అదితి బాలన్ హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, ఆగస్టు 29న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.