DoubleIsmart : డబుల్ ఇస్మార్ట్ కి టికెట్ హైక్స్.. ఎంతంటే?

Double Ismart : పూరి జగన్నాథ్ – రామ్ పొతినేని కాంబోలో తెరకెక్కిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా ఆగష్టు 15న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రామ్ – పూరి కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మాస్ సెంటర్లలో మంచి బజ్ ఉంది. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ తో పాటు, లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

Ticket Hike for DoubleIsmart in Andhra Pradesh

డబుల్ ఇస్మార్ట్ కి టికెట్ హైక్స్…

ఇక రామ్ పోతినేని (Ram pothineni) నటించిన డబుల్ ఇస్మార్ట్ (DoubleIsmart) సినిమాకు తాజాగా టికెట్ రేట్లు పెంచేశారు డిస్ట్రిబ్యూటర్లు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి టికెట్ హైక్ కి పర్మిషన్ లభించింది. టికెట్ పై 35 రూపాయలు పెంచొచ్చని పర్మిషన్ లభించింది. అంతే కాదు ఈ టికెట్ రేట్లను విడుదలైన పది రోజుల వరకు కొనసాగించవచ్చని తెలుస్తుంది. దీంతో మల్టీప్లెక్స్ లలో 250 నుండి 350 మధ్యలో టికెట్ రేట్లు ఉండగా, సింగిల్ స్క్రీన్స్ లో 150 నుండి 185 వరకు ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమా బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

- Advertisement -

పంద్రాగస్టున మూడు సినిమాల పోటీ!

ఇక ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ తో పాటు మరో రెండు సినిమాలు కూడా పోటీ పడనున్నాయి. అందులో ఒకటి మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా కాగా, ఇంకోటి చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మూడు కూడా డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన మాస్ సినిమాలు కాగా, ఈ సినిమాల బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. వీటితో పాటు ‘ఆయ్’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరి పంద్రాగస్టున పోటీ పడనున్న ఈ సినిమాలలో ఏ సినిమా ఎంత వరకు రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు