Pawan Kalyan With Aadhya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన సందర్భంలో జనసేన అనే ఒక పార్టీని స్థాపించి ప్రశ్నించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆ పార్టీ నిలబడడానికి దాదాపు 10 ఏళ్ల పాటు కాలం పట్టింది. ఈ పదేళ్లపాటు పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.
మొత్తానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతను చేపట్టారు. ఇక 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభకు హాజరయ్యారు. కళ్యాణ్ తో పాటు తన కూతురు ఆధ్యా కూడా హాజరయ్యారు. వారిద్దరూ కలిసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలు ఇద్దరు తండ్రి కూతుర్లు చూడముచ్చటగా ఉన్నారు. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఫోటో చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇక పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తనతో పాటు ప్రయాణిస్తున్న జర్నీలో తన పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా చాలామందిని కలుస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వెనుక అకీరా కనిపించాడు. ఇప్పుడు మొన్న ఎయిర్పోర్టులో, నేడు ఈ సభలు ఆద్య కనిపించడం మెగా ఫ్యాన్స్ తో పాటు చాలామందికి ఆనందంగా అనిపించింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఓజి. ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.