Prabhas: ప్రభాస్‌ కారణంగా ఆ హీరోయిన్‌ కెరీర్‌ నాశనం ?

Prabhas: బాలీవుడ్ నటి కృతి సనన్ (Krithi Sanon) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల ద్వారానే కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2014లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచేయ్ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. దీంతో కృతి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ (Krithi Sanon) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఆది పురుష్. ఓంరౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఆది పురుష్ సినిమా సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో (Prabhas) కృతి సనన్ ప్రేమలో పడిందని…. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా….తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ (Krithi Sanon)పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కృతి ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

1 Year For Prabhas Adipurush Movie
ఆది పురుష్ సినిమా (adipurush) ఫ్లాప్ అయినందుకు నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశాను అని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ మూవీ తర్వాత తనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా వచ్చిందని…. అదేవిధంగా ఆది పురుష్ సినిమా ఏ మతం వారిని అవమానించాలని ఉద్దేశంతో రాలేదని ఆమె సంచలన వాక్యాలు చేసింది. కానీ ప్రజలు అలా అనుకోవడంతో చాలా వివాదాలు వచ్చాయని….. అంతేకాకుండా ఆ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించి పెద్ద తప్పు చేశానని అర్థం వచ్చేలా కామెంట్స్ చేసింది. ఇక ఈ మాటలు విన్న కొంతమంది ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకుని ఏం లాభం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కృతి సనన్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు