People media factory: 100 సినిమాలు తీయాలనుకుంటే సరిపోదు, వాటిలో ఒక 50 సినిమాలైనా మంచివి ఉండాలి

People media factory: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. వాటిలో టక్కున వినిపించే పేర్లు హారిక హాసిని క్రియేషన్స్(Haarika Haasini Creations), మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers), శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations), సితార ఎంటర్టైన్మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి ఎన్నో సినిమాలను నిర్మించే సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యేకమని చెప్పాలి. ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి చాలా మంది దగ్గర అడ్వాన్సులు ఉన్నాయి. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే దాదాపు 40 సినిమాలను దాటి నిర్మించింది. 100 సినిమాలను తీయాలని ఉద్దేశ్యంతో టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీని స్థాపించినట్లు ఇదివరకే చాలాసార్లు చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పటివరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది రిలీజ్ అయిన సినిమాలలో సక్సెస్ రేట్ గురించి మాట్లాడితే కేవలం ఐదు నుంచి పది సినిమాలు మాత్రమే వినిపిస్తాయి. మిగతా సినిమాలన్నీ కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఒక దర్శకుడికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం, సినిమాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం వంటి క్వాలిటీస్ ఈ నిర్మాణ సంస్థకు ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టినా కూడా సినిమాలో క్వాలిటీ లేకపోతే అదంతా వృధాగా మారిపోతుంది.

People Media Factory

- Advertisement -

ఇక రీసెంట్ గా ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో కొనసాగుతుంది. మొదటి ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా నెగిటివ్ టాక్ కూడా మొదలైంది. ఈ తరుణంలో సినిమాలను బాగా చూసే కొంత మంది ఆడియన్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి 100 సినిమాలను నిర్మించాలి అని ఆలోచన ఉంటే సరిపోదు. దాంట్లో కనీసం 50 అయినా మంచి సినిమాలు ఉండాలి అంటూ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు