Stree 2 Collections : దుమ్ములేపుతున్న బాలీవుడ్ మూవీ… తెలుగు రాష్ట్రాల్లోనూ పై చేయి ఈ మూవీదే

Stree 2 Collections.. ఈమధ్య కాలంలో కథ బాగుంటే నటీనటులతో సంబంధం లేకుండా సినిమా విజయం సాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా ఎన్నో చిత్రాలు నిరూపించాయి. అందులో భాగంగానే శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం కూడా ఏకంగా స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు మొదటి రోజే రూ.60 కోట్ల గ్రాస్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా పై చేయి సాధించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పవచ్చు.

Stree 2 Collections: first day got highest collections in Bollywood industry.. Shraddha Das became a lady queen..!
Stree 2 Collections: first day got highest collections in Bollywood industry.. Shraddha Das became a lady queen..!

స్త్రీ -2 మొదటి రోజే రూ .60 కోట్ల గ్రాస్..

ప్రముఖ డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలకపాత్రలు పోషించిన స్త్రీ చిత్రానికి సీక్వెల్ గా ఈ స్త్రీ2 చిత్రాన్ని తెరకెక్కించారు. 2018 లో వచ్చిన హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను భయపెట్టి భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కడంతో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నిన్న సెలవు దినం కావడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. కనీవిని ఎరుగని రేంజ్ లో మొదటి రోజే ఈ సినిమా 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి చిత్రాలకు కూడా రాలేదు. దీనికి తోడు నిన్న మిస్టర్ బచ్చన్ , డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు విడుదలైనప్పటికీ కూడా కేవలం హిందీలోనే విడుదలైన స్త్రీ 2 చిత్రంపై అందరి చూపు ఉండడం గమనార్హం ..

స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్.

ఇదిలా ఉండగా మరొకవైపు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ , రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో రెండు చిత్రాలకి కూడా బుకింగ్ కాస్త తక్కువ అయినట్టు తెలుస్తోంది. ఇకపోతే స్త్రీ 2 చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా కపూర్ అంతకుముందు ప్రభాస్ తో సాహో చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైన ఈమె యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తనకంటూ ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటూ భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం హీరోలతో సంబంధం లేకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ మంచి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఫుల్ రన్ ముగిసే సరికి రూ.400 కోట్లకు పైగా పక్కా..

ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో అనుష్క , నయనతార వంటి హీరోయిన్లకు ఎంత స్టార్డమ్ ఉందో బాలీవుడ్లో దీపికా పదుకొనే, శ్రద్ధ కపూర్ లకి ఆస్థానం ఇప్పుడు ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా మొదటి రోజే రూ.60కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా రూ.400 కోట్లకు పైగానే వసూలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా శ్రద్ధా కపూర్ కి భారీ విజయాన్ని అందించిందని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు