Ram Charan.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈయనకు కూతురు క్లీంకారా జన్మించిన తర్వాత అదృష్టం భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్న ఈమె.. ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు గౌరవ డాక్టరేట్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో గౌరవాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ కి అరుదైన గౌరవం..
తాజాగా మెల్బోర్న్ లో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 25 వరకు జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకలకు రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు చలన చిత్రోత్సవాల్లో భాగంగా ఈయన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్ వేడుకలకు హాజరు కావాలంటూ ఇటీవల ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు రామ్ చరణ్ కి ఆహ్వానం అందించారు. కాగా ఈ చలనచిత్రోత్సవంలో రామ్ చరణ్ కి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నిర్వహకులు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరల్ అంబాసిడర్ అనే బిరుదును కూడా ప్రధానం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకటి తర్వాత మరొకటి చొప్పున ఇలా అరుదైన గౌరవాలను అందుకుంటూ తన స్థాయిని మరింత పెంచుకున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ కు అటు సినీ సెలబ్రిటీలు ఇటు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రామ్ చరణ్ సినిమాలు..
కెరియర్ విషయానికి వస్తే.. చిరుత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదు అని, అసలు హీరో కటౌట్ కాదు అని ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటినీ అధిగమించి నేడు గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుచ్చిబాబుతో సినిమా..
మరొకవైపు ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తన దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాను పూర్తి చేసి, త్వరలోనే బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.