Allu Arjun.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ చిరంజీవి అనే వృక్షం కింద కాకుండా సొంతంగా బ్రాండ్ ఏర్పరుచుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే సొంతంగా కథలు వింటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సహజంగానే కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. కొంతమంది దీనిని పొగరు అంటే మరి కొంతమంది అహంకారం అని కూడా అంటారు. ఇందులో ఎవరి వాదన వారిది వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిణామాల మధ్య ఏ చిన్న అనుమానం తలెత్తినా సరే అది చిలికి చిలికి గాలి వానలా మారుతుంది.
పిఠాపురం నుంచే కొత్త వివాదం మొదలు..
దీనికి తోడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆ సమయంలో మెగా కుటుంబ సభ్యులంతా ఆయనకు మద్దతు ప్రకటించారు. కానీ అల్లు అర్జున్ ఒక్క ట్వీట్ తో మాత్రమే సరిపెట్టాడు. కానీ నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న తన స్నేహితుడు వైసీపీ నేతకి మద్దతు ఇవ్వడానికి స్వయంగా అక్కడికి వెళ్లి ప్రచారం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా మెగా కుటుంబానికి , అల్లు అర్జున్కి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి తోడు పవన్ విజయం సాధించిన తర్వాత బన్నీ మరొక ట్వీట్ చేసి సరిపెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి కూడా ఆయన వెళ్లలేదు ఆహ్వానం అంది ఉండదని కొంతమంది అంటున్నా అందులో నిజా నిజాలు తెలియలేదు.
చిరంజీవికే అవమానమా..
ఇదిలా ఉండగా మెగా కుటుంబంలోని సభ్యురాలు అయిన నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు సినిమా నిర్మించింది. ఈమెకు మద్దతుగా మహేష్ బాబు , నాని లాంటి స్టార్ హీరోలు కూడా ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అసలు ఈ సినిమా గురించే ఆయన పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో బన్నీ వాసు నిర్మించిన ఆయ్ చిత్రం విడుదలయింది. ఈ సినిమాను అందరూ ఆదరించాలని అల్లు అర్జున్ ట్వీట్ చేయడమే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఈ ఒక్క ట్వీట్ అల్లు అర్జున్ కావాలనే మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు అనే విషయం కూడా స్పష్టం అవుతోంది. ఇకపోతే మెగాస్టార్ అనే బిరుదును ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బన్నీ, తన మేనమామ ప్రముఖ స్టార్ హీరోయిన్ చిరంజీవి కుటుంబం నుంచి ఒక అమ్మాయి నిర్మాతగా సక్సెస్ అయితే దీనిని పట్టించుకోకపోవడం చిరంజీవికి పెద్ద అవమానం అని చెప్పవచ్చు. ముఖ్యంగా తన ట్వీట్ తోనే చిరంజీవి ఫ్యామిలీ తో తనకు సంబంధం లేదు అన్నట్టు అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు అనిపిస్తోంది. మొత్తానికైతే తాజా పరిస్థితులను బట్టి చూస్తే వివాదం కాస్త ఇంకా ముదిరేలా కనిపిస్తోందని చెప్పవచ్చు.