Tollywood Hero’s: రీ రిలీజ్ లతో సరిపెట్టుకుంటున్న స్టార్ హీరోలు వీళ్లే..!

Tollywood Hero’s.. ఈ మధ్యకాలంలో హీరోలంతా కూడా పాన్ ఇండియా చిత్రాలు చేసి ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్క సినిమాను విడుదల చేయడానికి దాదాపు 2 నుండి 3 సంవత్సరాల సమయం తీసుకుంటూ అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. ప్రతి ఏడాది తమ హీరోకి సంబంధించిన ఒక్క సినిమా అయినా రావాలని అభిమానులు కోరుతుంటే, హీరోలు మాత్రం ఒక్క సినిమాకే రెండు మూడు సంవత్సరాలు కేటాయిస్తూ అదే సినిమా కోసం పాకులాడుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Tollywood Hero's: These are the star heroes who are adjusting to re-releases..!
Tollywood Hero’s: These are the star heroes who are adjusting to re-releases..!

రీ రిలీజ్ లతో సరికొత్త ప్రపంచం..

చిన్న హీరోల సంగతి పక్కన పెడితే.. ప్రత్యేకించి పెద్దపెద్ద స్టార్ హీరోలు తమ సినిమాల కోసం సంవత్సరాల తరబడి అభిమానులను వెయిట్ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు.. తమ హీరోల సినిమాలను థియేటర్లో చూడడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యం లో.. స్టార్ హీరోల కూడా తమ సినిమా కెరియర్ లో భారీ విజయాన్ని దక్కించుకున్న చిత్రాలను ఒక్కొక్కటిగా రీ రిలీజ్ చేస్తూ సంతోషపడుతున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు తమ కొత్త సినిమా విడుదలకు సమయం పడుతున్న నేపథ్యంలో ఇలా పాత చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇకపోతే రీ రిలీజ్ చిత్రాలతో సరిపెట్టుకుంటున్న హీరోలలో ప్రథమంగా వినిపించే పేర్లు మహేష్ బాబు ( Mahesh Babu), పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan).

రీ రిలీజ్ లకు కేరాఫ్ అడ్రస్గా మారిన మహేష్ బాబు..

ముఖ్యంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ సెట్ చేసిందే మహేష్ బాబు అభిమానులు.. ఎందుకంటే తమ హీరోలకు సంబంధించిన పెళ్లి రోజు, పుట్టినరోజు ఇలాంటి సందర్భాలు వస్తే ఖచ్చితంగా ఆ హీరోలు నటించే సినిమాల నుంచి అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తారు. కానీ ఆ సినిమాల నుంచి ఏ అప్డేట్ రాకపోతే ఇలా తమ హీరోలు విజయం సాధించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఒకసారి మహేష్ బాబు సినిమా విడుదలకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, మహేష్ బాబు క్రేజ్ ప్రేక్షకులలో తగ్గిపోతుందని ఆలోచించిన ఆయన అభిమానులు, పోకిరి (Pokiri )సినిమాను రీ రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు.
ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డు సృష్టించింది.

- Advertisement -

రీ రిలీజ్ లో కూడా ట్రెండ్ సెట్ చేసిన మురారీ, పోకిరి..

ముఖ్యంగా పోకిరి సినిమా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు ప్రస్తుతం మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. సినిమా విడుదల అవ్వడానికి మరో రెండు మూడు సంవత్సరాలు సమయం పడుతుంది. ఈలోపు ఆయన అభిమానులు ఆయనను మరిచిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు కెరీర్ లో భారీ విజయం సొంతం చేసుకున్న సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ఆయన కెరియర్లో కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన మురారీ (Murari )సినిమాను రీ రిలీజ్ చేసి కొత్తగా విడుదలైన సినిమాలకు కూడా పోటీగా నిలిచేలా చేశారు.

పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇంతే..

ఇక ఇది చూసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి చాలామంది హీరోల అభిమానులు కూడా తమ అభిమాన హీరోల సినిమాలను రీ రిలీజ్ చేశారు. త్వరలో చిరంజీవి ఇంద్ర సినిమా కూడా రీ రిలీజ్ కి సిద్ధం కాబోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాలలో నటించడానికి సమయం లేకుండా పోయింది. అందులో భాగంగానే ఆయన సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తూ సంతోష పడుతున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయకుండా ఇలా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ.. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు