KGF 3 – Salaar 2 : యష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ – ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్… ప్రశాంత్ నీల్ ప్లాన్ ఇదే..!

KGF 3 – Salaar 2: ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కే.జీ.ఎఫ్ 1,2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు త్వరలో సలార్ -2 సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇంతలోనే ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెబుతూ.. కన్నడ హీరో యష్ అభిమానులకు శుభవార్త తెలిపారు ప్రశాంత్ నీల్. ఇకపోతే ఇటీవల ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్రం అవార్డులలో భాగంగా కే జి ఎఫ్ చిత్రానికి జాతీయ అవార్డు లభించడంతో ఇప్పుడు సలార్ -2 చిత్రాన్ని పక్కన పెట్టి కేజిఎఫ్ 3 సినిమా తీయడానికి ప్రశాంత్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే సలార్ -2 సినిమాని పక్కన పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

KGF 3 - Salaar 2 : Good news for Yash fans - Bad news for Prabhas fans... This is Prashanth Neel's plan..!
KGF 3 – Salaar 2 : Good news for Yash fans – Bad news for Prabhas fans… This is Prashanth Neel’s plan..!

KGF 3 కి సర్వం సిద్ధం..

అసలు విషయంలోకి వెళితే, కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కేజిఎఫ్ సీరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కే.జి.ఎఫ్ చాప్టర్ 2 అయితే ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చి వరల్డ్ వైడ్ గా అత్యంత కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో ఈ సినిమా 4వ స్థానాన్ని సొంతం చేసుకుంది. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో రాఖీ భాయ్ బంగారంతో సహా సముద్రంలో మునిగిపోయినట్లు చూపించారు. అయితే అక్కడికి రాఖీ భాయ్ క్యారెక్టర్ ఎండ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ కేజీఎఫ్ 3 చాప్టర్ కూడా ఉంటుందని ఆమధ్య హోం భలే ఫిలిం అధినేత, కేజిఎఫ్ సిరీస్ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ స్పష్టం చేశారు. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశాడని కూడా తెలిపారు. అయితే ఒకవేళ ఈ సినిమా చేయాలన్నా 2026 తర్వాతనే సాధ్యమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు 2025 లోనే ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 3 సినిమాని మొదలు పెడతారనే ప్రచారం తెర పైకి వచ్చింది.

ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా..

ఇటీవల ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ స్టార్ట్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దాదాపు రెండు నెలల్లో మొదలవుతుందనే వార్త కూడా వినిపిస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది అయితే మరొకవైపు ప్రశాంత్ నీల్ సలార్ సీక్వెల్ “శౌర్యంగా పర్వం” సినిమా అని మొదలు పెట్టాల్సి ఉంది. కచ్చితంగా ఈ ఏడాదిలో సలార్ -2 పూర్తి చేసి 2025లో రిలీజ్ చేస్తారని అందరూ కూడా అనుకున్నారు. కానీ సడన్ గా ఈ సినిమాను పక్కనపెట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ స్టార్ట్ చేశారు. మరొకవైపు కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా తెరపైకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డార్లింగ్ అభిమానులు సలార్ -2 పై క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. మరి అభిమానుల డిమాండ్ మేరకు చిత్ర నిర్మాతలు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు