Shobhan Babu : ఒకప్పుడు టాలీవుడ్ లో ఎందరు హీరోలు ఉన్నా కూడా శోభన్ బాబు కు ఉన్న క్రేజ్ వేరే.. ఆయన అందం అంతగా ఆకట్టుకొనేది. అమ్మాయిలు ఆయన అందానికి ఫిదా అయ్యేవారు. శోభన్ బాబు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించి చివరి వరకు హీరోగానే చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం లేదు. కనీసం తన ఫ్యామిలీ గురించి ఎటువంటి విషయాలను ఇతరులతో పంచుకోలేదు. ఎందుకు ఆయన అలా చేశారో అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ఒకప్పుడు ఓ వ్యక్తి ఇదే ప్రశ్న శోభన్ బాబును అడిగాడట. దానికి ఆయన చెప్పిన సమాధానం విని అందరు షాక్ అయ్యారు.. సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఎక్కువగానే ఉంది.. కొందరు హీరోలు తమ వారసులను తీసుకురాగా.. మరికొందరు తమ్ముళ్లను, ఇతరులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం అందుకు విరుద్ధం. ఆయన సినిమాల్లో హీరోగా ఎన్నో సినిమాలు చేశారు.. ఇక శోభన్ బాబు నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన కుమారులు కూడా అచ్చు గుద్దినట్లు తండ్రిలాగే ఉన్నాడు.. ఆయన తలచుకుంటే హీరోగా చెయ్యొచ్చు.. కానీ ఆయన చెయ్యలేదు..
అస్సలు తన పిల్లల గురించి ఎప్పుడు బయటకు చెప్పలేదు.. ఎందరో హీరోలు తమ కుమారులను హీరోలుగా చేస్తున్నారు.. మీరు మాత్రం ఎందుకు మీ కుమారులను తీసుకురావడం లేదు? అని అడిగాడట. తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎంతో ఒత్తిడికి గురయ్యాను. ఈ ఒత్తిడి నా కుమారులకు ఉండద్దని కోరుకుంటున్నా.. వాళ్ళు వస్తానన్న వద్దని వారించాను అని చెప్పినట్లు రాజా రవీంద్రన్ ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలని చెప్పారు..
ఇకపోతే హీరోగానే కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత చివరి సినిమా హీరోగానే చేసిన తప్పుకుంటానని ముందే చెప్పిన శోభన్ బాబు అలాగే చేశారు. అయితే సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నంత కాలం శోభన్ బాబు డబ్బును బాగా పొదుపు చేశారు. ఆ డబ్బుతో చెన్నైలో భూములను కొనుగోలు చేశారు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇండస్ట్రీలోనే ఆ కాలంలో అందరికంటే ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.. ఆయన వల్లే మురళి మోహన్ కూడా అదే పని చేసినట్లు చెప్పారు.. ఏది ఏమైనా సినిమా కోసం పుట్టి ఎన్నో సినిమాలు చేసి చివరికి స్వర్గస్తులయ్యారు.. శోభన్ బాబు రియల్ హీరో అనే చెప్పాలి..