ShilpaShetty : బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమైన ఈ భామ తెలుగులో వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. సాహసవీరుడు సాగరకన్య సినిమాతో పాపులర్ అయిన శిల్పాశెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లో పాగా వేసింది. ఇదిలా ఉండగా అక్కడే సెటిల్ అయిన ఈ భామ బాంబే డైయింగ్ యజమాని అయిన రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రాజ్ కుంద్రా దేశంలో అత్యంత సంపన్నులలో ఒకడు. ఫోర్బ్స్ ప్రకటన ప్రకారం రాజ్ కుంద్రా దేశంలోనే 108వ అత్యంత ధనవంతుడని సమాచారం. ఇదిలా ఉండగా ఆ మధ్య రాజ్ కుంద్రా నీలిచిత్రాల యాప్ ల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రాజ్ కుంద్రా ను అందుకోసం పెళ్లి చేసుకోలేదు – శిల్పా శెట్టి
ఇక శిల్పా శెట్టి రీసెంట్ గా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలి లైఫ్ పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. సోషల్ మీడియాలో రాజ్కుంద్రాను అతని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలపై రియాక్ట్ అయింది. దాని గురించి శిల్పాశెట్టి మాట్లాడుతూ… తన భర్త ధనవంతుడు అయినా కూడా తమ పెళ్లికి డబ్బు కారణం కాదని శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది. అయితే తన ఆర్థిక స్థితి గురించి సోషల్ మీడియాలో కొన్ని అపోహలున్నాయని, తాను కూడా ముందునుండే ధనవంతురాలినని చెప్పుకొచ్చింది. అయితే రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకునే ముందు తన డబ్బు ముందు, తన గురించి పట్టించుకోలేదని అందుకే తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా తెలీదని అంది.
అయన చాలా మంచి వ్యక్తి – శిల్పాశెట్టి
అయితే రాజ్ కుంద్రా చాలా మంచి వ్యక్తి అని, ఆయన దగ్గర ఎంత డబ్బున్నా, మంచి వ్యక్తి కాకపోతే అతడిని పెళ్లి చేసుకోలేను అని “శిల్పా శెట్టి అన్నారు. మేం కలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడు.. అదే జరిగిందని, తమ ఫ్యామిలీ లో రీసెంట్ గా ఎన్ని వివాదాలొచ్చినా తమని విడదీయలేరని, తన ఫ్యామిలీకి, స్నేహితులకు కూడా రాజ్ కుంద్రా చాలా బాగా తెలుసు.. ఇప్పుడు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది. ఇక డబ్బు అన్నిటికీ సమాధానం కాదని శిల్పా శెట్టి చెప్పుకకొచ్చింది. ఇక శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా 2009లో వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం శిల్పాశెట్టి రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీం కి యజమాని గా ఉంటూ, పలు టివి షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది.