Tollywood Hero : తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలకు కొదవ లేదు.. ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాకు సీక్వెల్ తియ్యడం ఒకప్పటి ట్రెండ్.. ఇప్పటికి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు భారీ సక్సెస్ ను అందుకోగా మరికొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఒక్క తెలుగులో మాత్రమే కాదు. ఇప్పుడు వేరే ఇండస్ట్రీలో హిట్ అయినా సినిమాలను రిమేక్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్ సినిమాలు ఎక్కువైయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం ఇలాంటి సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. కానీ ఒక్క హీరో మాత్రం ఒక్క సినిమాను కూడా రీమేక్ చెయ్యలేదు. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ లోని స్టార్ హీరోలు వెంకటేష్, చిరంజీవి మొదలుకొని ప్రభాస్, అల్లు అర్జున్ వరకు అందరు హీరోలు రీమేక్ కథలతో సినిమాలు చేశారు. కానీ సూపర్ స్టార్ మహేష్ మాత్రం తన సినీ కేరీర్ లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదని తెలుస్తుంది.. ఆయన హీరోగా 23 ఏళ్ల కెరీర్లో మహేష్బాబు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు. రీమేక్ సినిమాల్లో నటించకూడదని తొలి సినిమా రాజకుమారుడు సమయంలోనే నిర్ణయించుకున్నాడు మహేష్బాబు. ఇన్నేళ్లలో ఆ రూల్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాడు. అందుకే తాను రీమేక్లకు దూరం అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు. రీమేక్ సినిమాలు అంటే కంపేరిజన్స్ రావడం కామన్. రీమేక్లలో ఎంత బాగా నటించినా కొన్నిసార్లు ఒరిజినల్ హీరోతో అనుకరించాడంటూ కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటివి రిస్క్ అనే ఆలోచనతోనే మహేష్ బాబు రీమేక్ కథలకు దూరంగా ఉంటూ వస్తోన్నాడని టాక్..
ఇకపోతే ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు.. మొన్నీమధ్య సర్కార్ వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.. ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలుసు. ప్రస్తుతం రాజమౌళితో సినిమా తన 29 వ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడూ మొదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జక్కన్న సినిమాలంటే ఆలస్యంగా మొదలవ్వడం, రిలీజ్ అవ్వడం కామన్. ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుందో చూడాలి..