Tollywood Heroines: ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్లు కేరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పారు. కొంతమంది భారతీయులను పెళ్లి చేసుకొని సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది మాత్రం ఫారినర్స్ ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యారు.. పెళ్లి తర్వాత వాళ్లు సినిమాల్లో కనిపించలేదు. ఆ హీరోయిన్లు ఎవరు? వారి పెళ్లి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మాధవి..
మాతృదేవో భవ సినిమా హీరోయిన్ మాధవి అందరికీ గుర్తే ఉంటుంది కదూ… ఈమె మొదటగా తూర్పు పడమర అనే సినిమాతో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు పరిచయం చేసిన హీరోయిన్ మాధవి అసలు పేరు విజయ లక్ష్మి.. తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన సలహా మేరకు ఆయన శిష్యుడు రాల్క్ శర్మని 1996లో పెళ్ళిచేసుకుని, న్యూజెర్సీలో నివాసం ఉంటోంది.. సినిమాల్లో కనిపించలేదు.. అలాగని బయట పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం ఈమె ఫ్యామిలీని లీడ్ చేస్తుంది.
రంభ..
రంభ పేరు తెలియని వాళ్లు ఉండరు.. కుర్రకారును తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. ఆమె చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు అందరి సినిమాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ తో చిందులేసిన హీరోయిన్ రంభ నటనకు గుడ్ బై చెప్పేసి, 2010లో ఇంద్ర కుమార్ అనే కెనడా వాసిని పెళ్ళాడి, అక్కడే సెటిల్ అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. రీసెంట్ గా విజయ్ దళపతిని తన ఫ్యామిలీతో వెళ్లి కలిశారు.
లయ..
పద్ధతికి చీర కడితే అది లయనే.. ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. లయ 2006లో సినిమాలను వదిలేసి ,శ్రీ గణేష్ అనే అమెరికా డాక్టర్ ని పెళ్ళాడి అక్కడే సెటిల్ అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి కూతురు ఈమధ్య బాలనటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. అందంలో తల్లికి ఏ మాత్రం తగ్గదు.. ఆమె కేరీర్ ఎలా ఉంటుందో చూడాలి..
వీరే కాదు శ్రియా శరన్, రిచా గంగోపాధ్యాయా వంటి హీరోయిన్లు ఫారినర్స్ ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యారు..