Mega family.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. దాదాపు ఈ కుటుంబం నుంచి వచ్చినంతమంది హీరోలు మరే కుటుంబం నుంచి రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun), అల్లు శిరీష్(Allu Sireesh), వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), వరుణ్ తేజ్ (Varun Tej), సాయి ధరంతేజ్(Sai Dharam Tej)ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పది మందికిపైగా హీరోలు ఒక్క ఈ కుటుంబం నుంచే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే ఈ కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో చాలామంది కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య , తండ్రి కొడుకులు మధ్య ఏదో ఒక వివాదం వినిపిస్తూ ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీ (Mega family)లో ఇలాంటి రూమర్స్ కి చోటు లేదు దీనికి కారణం చిరంజీవి అని చిరంజీవి నిర్మించిన ఒక ఇల్లు అని చెబుతున్నారు మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
కుటుంబం కోసం బెంగళూరులో ప్రత్యేక అతిథి గృహం..
ఇకపోతే చిరంజీవి హైదరాబాదులో ఒక ఇల్లు, బెంగళూరులో మరొక ఇల్లు ప్రత్యేకంగా దగ్గరుండి మరీ డిజైన్ చేయించిన విషయం తెలిసిందే. హైదరాబాదులో ఉండే ఇంటిలో వారు సతీసమేతంగా నివసిస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి, తన సోదరులు , సోదరీమణులు వారి పిల్లలు ఇలా అందరి కోసం బెంగళూరులో ఒక ఇంటిని నిర్మించారు. అయితే ఈ ఇంటిని కేవలం అతిథి గృహంగానే వీరు ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రతి పండుగకు లేదా ఎప్పుడైనా సెలవులు దొరికినప్పుడు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి చేరుకుంటారు. సరదాగా సమయం గడిపి, రుచికరమైన తమకు ఇష్టమైన వంటలు వండుకొని మరి తింటారట. అంతేకాదు రకరకాల ఆటలు ఇలా ఎన్నో విందు వినోదాలతో కాలక్షేపం చేసి వస్తారట.
మెగా కుటుంబానికి ఈ ఇల్లు ప్రత్యేక.
అయితే విందు వినోదాల కోసమే కాదు బంధం, బంధుత్వం బలంగా ఉండడానికి కూడా ఈ ఇంటిని నిర్మించినట్లు సమాచారం. ముఖ్యంగా మెగా కుటుంబంలో ఎవరి మధ్యైనా ఎప్పుడైనా అనుకోని ఘర్షణలు జరిగినప్పుడు మాట్లాడకుండా పోతారు.. అలాంటి సమయంలో ఇతరులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఈ బెంగళూరులోని అతిథి గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ వారంతా ఒకే చోట చేరి సమస్యలను పరిష్కరించుకుంటారట. అందుకే మెగా కుటుంబంలో ఇప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేవని చెబుతూ ఉంటారు. చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకుని ప్రత్యేక గృహాన్ని నిర్మించినట్లు సమాచారం. అందుకే మెగా ఫ్యామిలీకి ఈ ఇల్లు అంత ప్రత్యేకము అని చెప్పవచ్చు.మరి మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.
తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్..
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇంతకంటే ఎక్కువ రేంజ్ లోనే గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆయన వారసులు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ కార్పెట్ పై మెరిసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తుండగా , చిరంజీవి విశ్వంభర సినిమాను తెరకెక్కిస్తున్నారు.